త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Social Media | 16 ఏండ్ల‌లోపు పిల్లలు సోష‌ల్ మీడియా వాడ‌కంపై ఇండోనేషియా ఆంక్షలు

Social Media | మ‌రో దేశం సోష‌ల్ మీడియా వినియోగంపై (Social Media) ఆంక్ష‌లు విధించింది. 16 ఏండ్ల‌లోపు పిల్ల‌లు సామాజిక మాధ్య‌మాలు వినియోగించ‌కుండా ఇండోనేషియా (Indonesia) కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తీసుకొచ్చింది.

G

International | Published On Mar 29, 2026, 7.19 am IST

Social Media | 16 ఏండ్ల‌లోపు పిల్లలు సోష‌ల్ మీడియా వాడ‌కంపై ఇండోనేషియా ఆంక్షలు
Advertisement

Social Media | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌రో దేశం సోష‌ల్ మీడియా వినియోగంపై (Social Media) ఆంక్ష‌లు విధించింది. 16 ఏండ్ల‌లోపు పిల్ల‌లు సామాజిక మాధ్య‌మాలు వినియోగించ‌కుండా ఇండోనేషియా (Indonesia) కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తీసుకొచ్చింది. యూట్యూబ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్రెండ్స్, ఎక్స్, బిగో లైవ్, రోబ్లోక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో చిన్నారులు అకౌంట్లను తెరిచేందుకు వీలులేదంటూ క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. దీంతో ఆగ్నేయాసియాలో చిన్నారుల సామాజిక మాధ్యమాల వినియోగంపై ఆంక్షలు తీసుకువచ్చిన మొదటి దేశంగా ఇండోనేసియా నిలిచింది. గతేడాది ఆస్ట్రేలియా ఇదే తరహా నిబంధలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

పిల్లలను సైబర్‌ ముప్పు నుంచి రక్షించేందుకు, ఆన్‌లైన్‌లో అనుచిత కంటెంట్, సైబర్‌ వేధింపులు, ఆన్‌లైన్ స్కామ్‌లు, వంటి సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు క‌మ్మూనికేష‌న్‌, డిజిట‌ల్ వ్య‌వ‌హారాల మంత్రి ముత్య హ‌ఫీద్ (Meutya Hafid) తెలిపారు. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఈ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని, ఉల్లంఘించే కంపెనీలపై భారీ జరిమానాలు లేదా సేవలను నిలిపి వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలోని 2.8 కోట్ల జ‌నాభాలోని 70 ల‌క్ష‌ల మంది చిన్నారుల‌ను సోషల్ మీడియా వ్యసనం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనల నుంచి రక్షించడమే ప్రధాన లక్ష్యని చెప్పారు.

భారత్‌లో కూడా సోష‌ల్ మీడియాపై నిషేధాన్ని విధించేందుకు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్ప‌టికే కర్ణాటకలో 16 ఏండ్ల‌ లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించబోతున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన విష‌యం తెలిసిందే.

 

Advertisement

తాజావార్తలు

Advertisement