త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Modi | ఇథియోపియా అభివృద్ధిలో భార‌తీయుల‌ది కీల‌క పాత్ర‌: మోదీ

Modi | ఇథియోపియా (Ethiopia)లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాని (Prime Minister) న‌రేంద్ర మోదీ (Modi) ఆ దేశ పార్ల‌మెంటును ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆ దేశ అభివృద్ధిలో భార‌తీయుల‌ది కీల‌క పాత్ర అని అన్నారు.

A

International | Published On Dec 17, 2025, 1.17 pm IST

Modi | ఇథియోపియా అభివృద్ధిలో భార‌తీయుల‌ది కీల‌క పాత్ర‌: మోదీ
Advertisement

Modi | ఇథియోపియా (Ethiopia) అభివృద్ధిలో భార‌తీయుల‌ది కీల‌క పాత్ర అని ప్ర‌ధాని (Prime Minister) న‌రేంద్ర మోదీ (Modi) అన్నారు. దాదాపు రెండు వేల ఏళ్ల క్రిత‌మే మ‌న పూర్వీకులు హిందూమ‌హాస‌ముద్రం మీదుగా సుగంధ ద్ర‌వ్యాలు, బంగారం వాణిజ్యం జ‌రిగేద‌ని అన్నారు. 1941లో ఇథియోపియా విముక్తి కోసం భార‌తీయ సైనికులు ఇథియోపియ‌న్ల‌తో క‌లిసి పోరాడార‌ని గుర్తు చేశారు. మూడు దేశాల విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఇథియోపియాకు చేరుకుని, ఆ దేశ అత్యున్న‌త పుర‌స్కారం గ్రేట్ ఆన‌ర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా ను స్వీక‌రించారు. అనంత‌రం ఆ దేశ పార్ల‌మెంట్‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇథియోపియాలో ఉంటే సొంతింట్లో ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. సింహాల భూమి అయిన ఇథియోపియాకు రావ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్పారు. ఆ దేశంతో భారత్‌కు సత్సంబంధాలున్నాయని అన్నారు. ప్రపంచమంతా వసుధైక కుటుంబమైందని, భారతీయ టీచర్లు చాలా మంది ఇథియోపియాలో సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇథియోపియాలో అత్యధిక విదేశీ పెట్టుబడిదారులుగా భారతీయులే ఉన్నారని, వీరు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నారని వివ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement