త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వ‌ర‌కు 500 బిలియన్ల డాల‌ర్ల‌కు..

India US trade | అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు రోడ్‌మ్యాప్ అవసరమని అమెరికా రాయబారి సెర్జియో గోర్ మంగళవారం అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఘర్షణాత్మక అంశాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న ఉమ్మడి లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

S

International | Published On Aug 18, 2026, 6.24 pm IST

India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వ‌ర‌కు 500 బిలియన్ల డాల‌ర్ల‌కు..
Advertisement

India US trade | అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు రోడ్‌మ్యాప్ అవసరమని అమెరికా రాయబారి సెర్జియో గోర్ మంగళవారం అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఘర్షణాత్మక అంశాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న ఉమ్మడి లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2026 ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విశ్వాసం ఉంద‌ని, ఆయన మొదటి రోజు నుంచే ఈ సంబంధంపై భారీగా దృష్టి సారించార‌ని అన్నారు. రెండోసారి పదవీకాలం ప్రారంభమైన కొద్ది వారాల్లోనే ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి విశ్వాసం పెంపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించార‌ని గోర్ తెలిపారు. కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, రక్షణ, కీలక ఖనిజాలు వంటి వ్యూహాత్మక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని వేగవంతం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని చెప్పారు.

20 నుంచి 240 బిలియ‌న్ల‌కు..

రెండు దశాబ్దాల్లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డులను బద్దలు కొట్టింద‌ని, 20 బిలియన్ డాలర్ల నుంచి 240 బిలియన్ డాలర్లకు పెరిగింద‌ని గోర్ పేర్కొన్నారు. ఈ 12 రెట్ల వృద్ధి యాదృచ్ఛికంగా జరగలేదని, 2030 నాటికి ఈ విలువను 500 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్నది ఇరు దేశాల లక్ష్యమని చెప్పారు. ఇది భారత్, అమెరికా మధ్య ఉన్న అపారమైన వాణిజ్య అవకాశాలకు నిదర్శనమని అన్నారు. సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్, రక్షణ, సాంకేతికత, ఇంధనం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల ఆర్థిక సంబంధాల్లో అపూర్వమైన వేగం కనిపిస్తోందని గోర్ తెలిపారు. అమెరికా కంపెనీలకు మార్కెట్ అవకాశాలను విస్తరించడం, సరఫరా గొలుసులను మరింత పటిష్టంగా మార్చడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం ద్వారా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక లక్ష్యాలను ఉద్యోగాలు, వాణిజ్యం, పెట్టుబడులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఘ‌ర్ష‌ణాత్మ‌క అంశాలే కీల‌కం..

అయితే భారత్, అమెరికా నిజమైన భాగస్వాములుగా వ్యవహరిస్తూ తమ మధ్య ఉన్న ఘర్షణాత్మక అంశాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా రాయబారి స్పష్టం చేశారు. వ్యాపారాలు సజావుగా అభివృద్ధి చెందేందుకు అంచనా వేయగలిగే పన్ను విధానాలు, నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యాపారవేత్త, రాజకీయ వ్యూహకర్త సెర్జియో గోర్ గతంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల కోసం అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా, వైట్ హౌస్ అధ్యక్ష సిబ్బంది కార్యాలయ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. భారత్, అమెరికా కలిసి పనిచేసినప్పుడు విలువ గొలుసులు మరింత సమర్థంగా అనుసంధానమవుతాయని, కీలక సాంకేతిక రంగాల్లో పురోగతి వేగవంతమవుతుందని, సరఫరా గొలుసుల స్థిరత్వం మరింత బలపడుతుందని గోర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement