త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Komatireddy | 22ఏ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

Minister Komatireddy | 22ఏ నిషేధిత జాబితాలో భూముల చేర్పు వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వ్యవహారం వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

P

Telangana | Published On Aug 18, 2026, 5.54 pm IST

Minister Komatireddy | 22ఏ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
Advertisement

Minister Komatireddy | 22ఏ నిషేధిత జాబితాలో భూముల చేర్పు వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వ్యవహారం వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉండొచ్చని పేర్కొన్నారు. ‘‘22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు. సమగ్ర విచారణ చేస్తాం. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండవచ్చు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నాను. బాధితులకు న్యాయం చేస్తాం’’ అని మంత్రి తెలిపారు. ‘‘దరఖాస్తుల అవసరం లేదు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. పొరపాటున జరిగిందా..? కావాలనే చేశారా అన్న‌దానిపై విచారణ చేస్తాం’’ అని అన్నారు.

యాదగిరిగుట్టలో 42వేల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన విషయాన్ని సీఎం దృష్టికి నాలుగు నెలల క్రితమే తీసుకెళ్లానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ‘‘కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండవచ్చు. బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయి. 30 శాతం కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘సీఎం అమెరికా టూర్ తర్వాత దీనిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం. మా ప్రభుత్వం మంచితనాన్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం చేసి ఉండవచ్చు. తప్ప ఎవరిదో తేలితే వాళ్లను ఏం చేయాలో తేలుతుంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. 22ఏ జాబితా విషయంలో మధ్యతరగతి, పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోను. ప్రతిపక్షాల విమర్శలు అర్థం లేనివి’’ అని మంత్రి కోమ‌టిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement