త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nepal | మూడు రోజులుగా వ‌ర‌ద‌ బుర‌దలోనే.. అయినా బ‌తికింది..

Nepal | నేపాల్‌లో వ‌ర‌ద‌ల్లో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది గ‌ల్లంత‌య్యారు. అయితే ఓ ఆరేళ్ల బాలిక మాత్రం.. మూడు రోజుల పాటు శిథిలాల కింద బుర‌ద‌లోనే కూరుకుపోయింది. అయినా చివ‌రికి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

S

International | Published On Aug 30, 2026, 9.29 pm IST

Nepal | మూడు రోజులుగా వ‌ర‌ద‌ బుర‌దలోనే.. అయినా బ‌తికింది..
Advertisement

Nepal | త్రినేత్ర‌.న్యూస్ : నేపాల్‌లో వ‌ర‌ద‌ల్లో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది గ‌ల్లంత‌య్యారు. అయితే ఓ ఆరేళ్ల బాలిక మాత్రం.. మూడు రోజుల పాటు శిథిలాల కింద బుర‌ద‌లోనే కూరుకుపోయింది. అయినా చివ‌రికి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

ర‌సువా జిల్లాలో వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టించాయి. భోటే కోశి రివ‌ర్ ఉప్పొంగ‌డంతో.. తిమురే గ్రామంలోఓ వ‌ర‌ద పోటెత్తింది. దీంతో స్థానికంగా ఇండ్లు నేల‌మట్టం అయ్యాయి. ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్ర‌మంలో అక్క‌డ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్ త‌క్ష‌ణ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే శిథిలాల కింద నుంచి ఓ చిన్నారి ఏడుపు వారికి వినిపించింది. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా.. శిథిలాల‌ను తొల‌గించి, బుర‌ద‌లో కూరుకుపోయిన ఆరేళ్ల పాప‌ను ప్రాణాల‌తో కాపాడారు.

తిమురేలో ప్రాథ‌మిక చికిత్స అందించారు. అనంత‌రం ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ఖాట్మండ్ త‌ర‌లించి మెరుగైన చికిత్స అందించారు. ప్ర‌స్తుతం బాలిక కోలుకుంటుంద‌ని వైద్యులు తెలిపారు. బాధితురాలి త‌ల్లిదండ్రులు, బంధువుల కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. బంధువుల ఆచూకీ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement