Bangladesh | పద్మానదిలో పడిన బస్సు.. 23 మంది దుర్మరణం.. వీడియో
Bangladesh | బంగ్లాదేశ్లో (Bangladesh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్బరి జిల్లాలోని దౌలడియా టెర్మినల్ (Dauladia terminal) వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి (Padma River) దూసుకెళ్లింది. దీంతో 23 మంది జలసమాధి అయ్యారు.
International | Published On Mar 26, 2026, 9.31 am IST
Bangladesh | త్రినేత్ర.న్యూస్: బంగ్లాదేశ్లో (Bangladesh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్బరి జిల్లాలోని దౌలడియా టెర్మినల్ (Dauladia terminal) వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి (Padma River) దూసుకెళ్లింది. దీంతో 23 మంది జలసమాధి అయ్యారు. పలువురు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. బుధవారం సాయంత్రం 5.15 గంటల సమయంలో బస్సు ఫెర్రీ ఎక్కే సమయంలో నదిలో పడిపోయిందని అధికారులు చెప్పారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గత అర్ధరాత్రి భారీక్రేన్ల సహాయంతో బస్సును నదిలో నుంచి బయటకు తీశారు. బస్సులోనే 14 మంది ప్రయాణికుల మృతదేహాలు లభించాయని చెప్పారు. మరో 11 మంది నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారికోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. రంజాన్ పండుగ ముగించుకుని రాజధాని ఢాకా వేళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం.
https://x.com/KantInEastt/status/2036874279900569631
https://x.com/KantInEastt/status/2037009790283767831
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు.
https://x.com/DDNewslive/status/2036842267810652185
సంబంధిత వార్తలు

Bangladesh | సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
మే 12, 2026

Indian High Commissioner | బంగ్లాదేశ్లో భారత రాయబారిగా బెంగాల్ బీజేపీ నేత!
ఏప్రిల్ 20, 2026

Hasina’s Extradition Case | షేక్ హసీనా అప్పగింతపై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు..!
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



