త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangladesh | ప‌ద్మాన‌దిలో ప‌డిన బ‌స్సు.. 23 మంది దుర్మ‌ర‌ణం.. వీడియో

Bangladesh | బంగ్లాదేశ్‌లో (Bangladesh) ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రాజ్‌బ‌రి జిల్లాలోని దౌల‌డియా టెర్మిన‌ల్ (Dauladia terminal) వ‌ద్ద ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు ప‌ద్మాన‌దిలోకి (Padma River) దూసుకెళ్లింది. దీంతో 23 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు.

G

International | Published On Mar 26, 2026, 9.31 am IST

Bangladesh | ప‌ద్మాన‌దిలో ప‌డిన బ‌స్సు.. 23 మంది దుర్మ‌ర‌ణం.. వీడియో
Advertisement

Bangladesh | త్రినేత్ర‌.న్యూస్‌: బంగ్లాదేశ్‌లో (Bangladesh) ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రాజ్‌బ‌రి జిల్లాలోని దౌల‌డియా టెర్మిన‌ల్ (Dauladia terminal) వ‌ద్ద ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు ప‌ద్మాన‌దిలోకి (Padma River) దూసుకెళ్లింది. దీంతో 23 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు. ప‌లువురు గ‌ల్లంత‌య్యారు. ఈ నేప‌థ్యంలో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. బుధ‌వారం సాయంత్రం 5.15 గంట‌ల స‌మ‌యంలో బ‌స్సు ఫెర్రీ ఎక్కే స‌మ‌యంలో న‌దిలో ప‌డిపోయింద‌ని అధికారులు చెప్పారు.

ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో గ‌త అర్ధ‌రాత్రి భారీక్రేన్ల స‌హాయంతో బ‌స్సును న‌దిలో నుంచి బ‌య‌ట‌కు తీశారు. బ‌స్సులోనే 14 మంది ప్ర‌యాణికుల మృత‌దేహాలు ల‌భించాయ‌ని చెప్పారు. మ‌రో 11 మంది న‌దిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గ‌ల్లంతైన వారికోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. రంజాన్ పండుగ ముగించుకుని రాజ‌ధాని ఢాకా వేళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో చిన్నారులు స‌హా 40 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం.

https://x.com/KantInEastt/status/2036874279900569631

https://x.com/KantInEastt/status/2037009790283767831

ఈ ఘ‌ట‌న‌పై బంగ్లాదేశ్ ప్ర‌ధాని తారిఖ్ రెహ‌మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. బాధితుల‌కు త‌క్ష‌ణ స‌హాయం అందించాల‌ని ఆదేశించారు.

https://x.com/DDNewslive/status/2036842267810652185

Advertisement

తాజావార్తలు

Advertisement