Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత – రాజమౌళి సినిమాతో ఫేమస్ – ఐదు భాషల్లో సినిమాలు
ప్రముఖ టాలీవుడ్ నటుడు, సై మూవీ ఫేమ్ ప్రదీప్ రావత్ మంగళవారం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రదీప్ రావత్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోన్నట్లు సమాచారం. తెలుగులో సై, ఛత్రపతి, అందరివాడు, దేశముదురుతో పాటు పలు సినిమాల్లో విలన్గా నటించాడు.
Entertainment | Published On Aug 4, 2026, 10.59 pm IST
Pradeep Rawat | ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ రావత్ (74)అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్లడ్క్యాన్సర్తో బాధపడుతోన్నట్లు తెలిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం తుది శ్వాస విడిచినట్లు సన్నిహితులు పేర్కొన్నారు. హిందీ సినిమాలతో ప్రదీప్ రావత్ కెరీర్ ప్రారంభమైంది. కానీ తెలుగు సినిమాలే నటుడిగా అతడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. టాలీవుడ్లో యాభైకిపైగా సినిమాలు చేశారు. ఎక్కువగా విలన్ పాత్రల్లోనే కనిపించారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు.
సైతో ఫేమస్...
నితిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సై సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రదీప్ రావత్. ఈ సినిమాలో భిక్షూ యాదవ్ పాత్రలో తన విలనిజంతో తెలుగు ఆడియెన్స్ను భయపెట్టాడు. సైతో ఫేమస్ అయిన ప్రదీప్ రావత్ తెలుగులో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. ఛత్రపతి, అందరివాడు, మాయాజాలం, లక్ష్మి, దేశముదురు, బలాదూర్, గజినితో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్గా కనిపించాడు.
నేను శైలజ, ఓయ్తో పాటు మరికొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు చేశాడు. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం సినిమాతో చివరగా నటించాడు.
అశ్వాత్థామ పాత్రలో...
రాజ్బబ్బర్ హీరోగా నటించిన ఐత్బార్ మూవీతో ప్రదీప్ రావత్ సినీ జర్నీ మొదలైంది. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించాడు. అగ్నిపథ్, భాఘీ, కోయ్లాతో పాటు చాలా సినిమాలు చేశాడు. హిందీలో ఎక్కువగా ఆమిర్ఖాన్ సినిమాల్లో ప్రదీప్ రావత్ కనిపించేవారు. సినిమాల కంటే ముందు మహాభారతం సీరియల్లో అశ్వత్థామ పాత్రలో ప్రదీప్ రావత్ నటించాడు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!



