CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
CM Revanth Reddy | రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని దశల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని దశల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నియామక ప్రక్రియకు భంగం కలిగించేలా కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థ ప్రయోజనాల శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి నివేదించాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. నోటిఫికేషన్కు సంబంధించిన ప్రతి దశను నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణ, భద్రపరిచడం, రవాణా తదితర ప్రక్రియల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్ఠం చేయాలని, ముఖ్యంగా కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. నియామక పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల ద్వారా దుష్ప్రచారం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. పరీక్షల ప్రక్రియ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తి అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వీ శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్బాస్ తనూజ తెలుగు వెబ్సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం



