త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Train Accident | స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి

Train Accident | ద‌క్షిణ‌ స్పెయిన్‌లో (Spain) ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. ఆదివారం సాయంత్రం (స్థానిక కాల‌మానం ప్ర‌కారం) కార్డోబా ప్రావిన్స్ అడాముజ్ ప్రాంతంలో రెండు హైస్పీడ్ రైళ్లు (High-Speed Trains) ఢీకొన్నాయి.

G

International | Published On Jan 19, 2026, 7.11 am IST

Train Accident | స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ద‌క్షిణ‌ స్పెయిన్‌లో (Spain) ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. ఆదివారం సాయంత్రం (స్థానిక కాల‌మానం ప్ర‌కారం) కార్డోబా ప్రావిన్స్ అడాముజ్ ప్రాంతంలో రెండు హైస్పీడ్ రైళ్లు (High-Speed Trains) ఢీకొన్నాయి. దీంతో సుమారు 21 మంది మృతి చెందారు. మ‌రో 73 మందికిపైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

మ‌లాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న‌ హై స్పీడ్‌ రైలు అడాముజ్ వ‌ద్ద‌ పట్టాలు తప్పి మ‌రో ట్రాక్‌పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ట్రాక్‌పై వ‌స్తున్న మ‌రో హైస్పీడ్ రైలు దానిని ఢీకొట్టి అదికూడా ప‌ట్టాలు త‌ప్పింది. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌న‌లో సుమారు 25 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని స్థానిక మీడియా పేర్కొంది. 100 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డార‌ని వెల్ల‌డించింది.

రైలు ప్ర‌మాద‌ ఘ‌ట‌న‌పై స్పెయిన్ ప్ర‌ధాని పెడ్రో సాంచెజ్ దిగ్భాంతి వ్య‌క్తం చేశారు. బాధితుల‌కు మెరుగైన స‌హాయం అందించేందుకు ప్ర‌భుత్వం కృషిచేస్తుంద‌న్నారు. మృతుల కుటుంబాను ప్ర‌భుత్వం స‌హాయం చేస్తుంద‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement