త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nepal Bus Accident | న‌దిలో ప‌డిన బ‌స్సు.. 18 మంది ప్ర‌యాణికులు దుర్మ‌ర‌ణం

Nepal Bus Accident | హిమాల‌య దేశం నేపాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Nepal Bus Accident) జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం ధాడింగ్ (Dhading) జిల్లాలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు ( Passenger Bus) అదుపుత‌ప్పి న‌దిలో ప‌డిపోయింది.

G

International | Published On Feb 23, 2026, 9.15 am IST

Nepal Bus Accident | న‌దిలో ప‌డిన బ‌స్సు.. 18 మంది ప్ర‌యాణికులు దుర్మ‌ర‌ణం
Advertisement

Nepal Bus Accident | త్రినేత్ర‌.న్యూస్‌: హిమాల‌య దేశం నేపాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Nepal Bus Accident) జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం ధాడింగ్ (Dhading) జిల్లాలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు ( Passenger Bus) అదుపుత‌ప్పి న‌దిలో ప‌డిపోయింది. దీంతో 18 మంది మ‌ర‌ణించారు. మ‌రో 28 మంది తీవ్రంగా గాయ‌డ్డారు.

45 మంది ప్ర‌యాణికుల‌తో బ‌స్సు ఫోకారా నుంచి ఖాట్మండుకు వెళ్తున్నది. ఈ క్ర‌మంలో బెనిఘాట్ రోరాంగ్ గ్రామీణ మున్సిపాలిటీ-5లోని భైసిగౌడ వద్ద పృథ్వీ హైవేపై బస్సు అదుపుతప్పి త్రిశూలి నదిలోకి దూసుకెళ్లింది. సోమవారం) తెల్లవారుజామున 1:30 గంటల స‌మ‌యంలో ఈ ఘటన చోటుచేసుకున్న‌ది. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌ ఆర్మీ, పోలీసు సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 18 మృత‌దేహాలను వెలికితీయ‌గా, గాయ‌ప‌డిని 28 మంది ప్ర‌యాణికుల‌ను ర‌క్షించారు. వారిని స‌మీపంలోని ద‌వాఖాన‌ల‌కు త‌ర‌లించామ‌ని డీఎస్పీ థాపా వెల్ల‌డించారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ఇంకా గుర్తించ‌లేద‌ని తెలిపారు.

అయితే మృతుల్లో న్యూజిలాండ్‌కు చెందిన వ్య‌క్తి ఉన్నార‌ని చెప్పారు. జ‌పాన్‌, డ‌చ్ జాతీయులైన ఇద్ద‌రు మ‌హిళ‌లు గాయ‌ప‌డ్డార‌ని వెల్ల‌డించారు. అతివేగం లేదా సాంకేతిక లోపం కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు.

https://x.com/tweet_sandeep/status/2025757122156437766

Advertisement

తాజావార్తలు

Advertisement