త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Qatar | ఖ‌తార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 12 మంది భార‌తీయులు మృతి

Qatar | ఖ‌తార్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. అత్యంత కీల‌క‌మైన గ్యాస్ పోర్టులో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ఘ‌ట‌న‌లో 13 మంది మృతి చెంద‌గా, ఇందులో 12 మంది భార‌తీయులు ఉన్నారు.

S

International | Published On Jun 23, 2026, 7.08 am IST

Qatar | ఖ‌తార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 12 మంది భార‌తీయులు మృతి
Advertisement

Qatar | త్రినేత్ర‌.న్యూస్ : ఖ‌తార్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. అత్యంత కీల‌క‌మైన గ్యాస్ పోర్టులో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ఘ‌ట‌న‌లో 13 మంది మృతి చెంద‌గా, ఇందులో 12 మంది భార‌తీయులు ఉన్నారు. మిగ‌తా ఒక్క‌రు పాకిస్తాన్‌కు చెందిన వ్య‌క్తిగా గుర్తించారు. మ‌రో 60 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాలిన గాయాల‌తో వీరంతా ప‌లు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పశ్చిమాసియా యుద్ధ సమయంలో రస్‌ లఫాన్ పారిశ్రామిక న‌గ‌రంపై ఇరాన్‌ బాంబులతో విరుచుకుప‌డింది. హర్మూజ్‌ మూసివేత కారణంగా గ్యాస్ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఈ గ్యాస్‌ క్షేత్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో రస్‌ లఫాన్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు కార్మికులు ప్రయత్నించగా.. అక్కడి బర్జాన్‌ గ్యాస్‌ సరఫరా ప్లాంట్‌లో సాంకేతిక వైఫల్యం కారణంగా భారీ పేలుడు చోటుచేసుకొని పెద్దఎత్తున మంటలు చెలరేగ‌డంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

అంతర్జాతీయ గ్యాస్‌ వాణిజ్యానికి రస్‌ లఫాన్‌ ఆయువుపట్టు వంటిది. ఇక్కడి నుంచి భారత్‌ సహా దాదాపు 30 దేశాలకు గ్యాస్‌ ఎగుమతి అవుతుంటుంది. తాజా పేలుడుతో ఈ సరఫరా గొలుసు దెబ్బతినే ముప్పుంది. బర్జాన్‌ గ్యాస్‌ ప్లాంట్‌ రోజుకు సుమారు 140 కోట్ల స్టాండర్డ్‌ క్యూబిక్‌ ఫీట్‌ గ్యాస్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Advertisement
Advertisement