త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | క‌లిసి మ‌ద్యం సేవించారు.. స్నేహితుడిని హ‌త్య చేశారు..

Hyderabad | స్నేహితులంద‌రూ క‌లిసి మ‌ద్యం సేవించారు. కాసేప‌టికే చోటు చేసుకున్న గొడ‌వ ఓ యువ‌కుడి ప్రాణాల‌ను బ‌లిగొన్నాయి.

S

Hyderabad | Published On Jul 10, 2026, 9.31 pm IST

Hyderabad | క‌లిసి మ‌ద్యం సేవించారు.. స్నేహితుడిని హ‌త్య చేశారు..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : స్నేహితులంద‌రూ క‌లిసి మ‌ద్యం సేవించారు. కాసేప‌టికే చోటు చేసుకున్న గొడ‌వ ఓ యువ‌కుడి ప్రాణాల‌ను బ‌లిగొన్నాయి. ఈ దారుణ ఘ‌ట‌న హ‌య‌త్‌న‌గ‌ర్ ప‌రిధిలోని శ్రీన‌గ‌ర్ కాల‌నీలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ 22 ఏళ్ల యువ‌కుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి మ‌ద్యం సేవించాడు. ఈ క్ర‌మంలో స్నేహితుల‌తో ఆ యువ‌కుడికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడ‌వ నుంచి త‌ప్పించుకునేందుకు చ‌ర‌ణ్ య‌త్నించాడు. దీంతో అత‌న్ని వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసి హ‌త్య చేశారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హ‌త్యకు గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement
Advertisement