త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | డెలివ‌రి విష‌యంలో స్నేహితుల మ‌ధ్య గొడ‌వ‌.. యువ‌కుడి దారుణ హ‌త్య‌

Hyderabad | స్నేహితుల మ‌ధ్య మొద‌లైన చిన్న త‌గాదా దారుణ హ‌త్య‌కు (Murder) దారితీసింది. డెలివ‌రి విష‌యంలో గొడ‌వ ప‌డిన స్నేహితులు.. స‌హ‌చ‌రుడిని వెంటాడి చంపిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని (Hyderabad) నార్సింగిలో చోటుచేసుకుంది.

G

Hyderabad | Published On Aug 14, 2026, 7.33 am IST

Hyderabad | డెలివ‌రి విష‌యంలో స్నేహితుల మ‌ధ్య గొడ‌వ‌.. యువ‌కుడి దారుణ హ‌త్య‌
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: స్నేహితుల మ‌ధ్య మొద‌లైన చిన్న త‌గాదా దారుణ హ‌త్య‌కు (Murder) దారితీసింది. డెలివ‌రి విష‌యంలో గొడ‌వ ప‌డిన స్నేహితులు.. స‌హ‌చ‌రుడిని వెంటాడి చంపిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని (Hyderabad) నార్సింగిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఓ డెలివ‌రి (Delivery) విష‌యంలో స్నేహితుల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ఘ‌ర్షణ‌కు దారితీయడంతో.. అబ్దుల్ స‌మీద్‌ అనే యువకుడిని అతడి సహచర స్నేహితులే వెంటాడి దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్లతో అత‌నిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయ‌ప‌డి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. హత్యకు గ‌ల అసలు కారణం ఏమిటి?, వారి మ‌ధ్య గతంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత విభేదాలు, పాత గొడవలు లేదా ఇతర కారణాలు ఈ హత్యకు దారితీశాయా అనే అంశాలను ఆరాతీస్తున్నారు.

Advertisement
Advertisement