త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

ఓట్ల తొలగింపుపై టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మంత్రులు, ఇంచార్జులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు.

J

Telangana | Published On Aug 13, 2026, 11.00 pm IST

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

సంక్షిప్త సారాంశం

టీపీసీసీ జూమ్ సమావేశంలో ఓటర్ల జాబితా (SIR) ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఇంచార్జుల నిర్లక్ష్యం వల్లే ఏకంగా 21 శాతం ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లాలకు వెళ్లి రెండ్రోజుల పాటు సమీక్షలు నిర్వహించి, ప్రతి నియోజకవర్గం రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఓట్ల తొలగింపు వెనుక ఉన్న బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Advertisement
  • మంత్రులకు సీఎం రేవంత్ వార్నింగ్

SIR Process Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా 21 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై మంత్రులు, పార్టీ శ్రేణులు తక్షణమే అప్రమత్తం కావాలని ఆదేశించారు. తాజాగా జరిగిన టీపీసీసీ (TPCC) జూమ్ సమావేశంలో ఆయన పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు.

నిర్లక్ష్యం చేస్తే కుదరదు.. రిపోర్టులు ఇవ్వాల్సిందే

ఇంచార్జ్ మంత్రుల నుంచి బూత్ లెవెల్ (Booth level) కార్యకర్తల వరకు ఎవరూ సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే ఇలాంటి గడ్డు పరిస్థితి తలెత్తిందని సీఎం మండిపడ్డారు. తక్షణమే సంబంధిత ఇంచార్జ్ మంత్రులు తమ జిల్లాల్లోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులతో రివ్యూ మీటింగ్స్ (Review meetings) నిర్వహించాలన్నారు. రెండ్రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కచ్చితమైన రిపోర్టును (Report) సిద్ధం చేయాలని డెడ్‌లైన్ విధించారు. అసెంబ్లీ ఇంచార్జులు కూడా కనీసం నాలుగు రోజులు నియోజకవర్గంలోనే ఉండి, గ్రౌండ్ లెవెల్ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైకమాండ్ సీరియస్.. ఉపేక్షించేది లేదు

ఓట్ల తొలగింపు అంశంపై అధిష్టానం (AICC) నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సరైన యాక్షన్ ప్లాన్ (Action plan) లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కాంగ్రెస్ హైకమాండ్ ఎవరినీ ఉపేక్షించబోదని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లకపోతే భవిష్యత్‌లో పార్టీకి ఊహించని స్థాయిలో రాజకీయ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.

ఆ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ఓటర్ల జాబితా (SIR) ప్రక్రియలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, బీజేపీ-బీఆర్ఎస్ (BJP-BRS) పార్టీలు కలిసి ఆడుతున్న ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తా దీన్ని బాధ్యతగా తీసుకుని పని చేయాలని, పార్టీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement