త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kidney Symposium 2026 | కిడ్నీ మార్పిడిలో అద్భుతాలు: 400+ సర్జరీలతో యశోద హాస్పిటల్స్ సరికొత్త రికార్డ్

యశోద హాస్పిటల్స్‌-హైటెక్ సిటీలో ఘనంగా 'కిడ్నీ సింపోజియం 2026'. 400కు పైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ పూర్తి చేసిన వైద్య బృందాన్ని అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

J

Hyderabad | Published On Aug 29, 2026, 5.41 pm IST

Kidney Symposium 2026 | కిడ్నీ మార్పిడిలో అద్భుతాలు: 400+ సర్జరీలతో యశోద హాస్పిటల్స్ సరికొత్త రికార్డ్
Advertisement
  • హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌ (హైటెక్ సిటీ) ఆధ్వర్యంలో "కిడ్నీ సింపోజియం 2026" సదస్సు
  • 400కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన యశోద నెఫ్రాలజీ బృందం
  • ముఖ్య అతిథిగా హాజరై, అవయవదానం (Organ Donation) పై ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
  • బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని (ABO-incompatible) వారికి, వృద్ధులకు సైతం విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్స్ చేస్తున్నట్లు వెల్లడించిన వైద్యులు

Kidney Symposium 2026 | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ (హైటెక్ సిటీ) కిడ్నీ మార్పిడి (Kidney Transplant) చికిత్సలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో 400కు పైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసి ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదించింది. ఈ అరుదైన విజయాన్ని పురస్కరించుకుని శనివారం హైటెక్ సిటీ బ్రాంచ్‌లో “కిడ్నీ సింపోజియం 2026” (Kidney Symposium 2026) పేరిట ఒక భారీ వైద్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు పాల్గొని లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ, క్లినికల్ అనుభవాలపై చర్చించారు.

Yashoda Hospitals Hitec City Celebrates 400+ Successful Kidney Transplants

ఈ సదస్సుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా, యశోద హాస్పిటల్స్ చైర్మన్ జి. రవీందర్ రావు, ఎండీ డాక్టర్ జి. సురేందర్ రావు ప్యాట్రన్లుగా వ్యవహరించారు. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Yashoda Hospitals Hitec City Celebrates 400+ Successful Kidney Transplants

కొత్త జీవితానికి ఆశ.. అవయవదానమే కీలకం

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ఒక కొత్త ఆశ అని అన్నారు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని (ABO-incompatible) వారికి, వయసు పైబడిన రోగులకు సైతం యశోద వైద్యులు విజయవంతంగా సర్జరీలు చేయడం అభినందనీయమన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబాలు అవయవదానం (Organ Donation) చేసేలా ప్రజల్లో మరింత అవేర్‌నెస్ రావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

Yashoda Hospitals Hitec City Celebrates 400+ Successful Kidney Transplants

సమిష్టి కృషితోనే ఈ విజయం

యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. సురేందర్ రావు మాట్లాడుతూ.. లేటెస్ట్ టెక్నాలజీ, ఎక్స్‌పర్ట్ డాక్టర్ల టీమ్‌వర్క్ వల్లే 400 కు పైగా ట్రాన్స్‌ప్లాంట్స్ సక్సెస్‌ఫుల్ అయ్యాయన్నారు. వృద్ధులైన డోనర్ల నుంచి కిడ్నీలు సేకరించి విజయవంతంగా మార్పిడి చేయడం తమ వైద్య బృందం నిబద్ధతకు నిదర్శనమన్నారు.

Yashoda Hospitals Hitec City Celebrates 400+ Successful Kidney Transplants

సర్జరీ తర్వాత కేర్ చాలా ముఖ్యం

నెఫ్రాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి మాట్లాడుతూ.. కిడ్నీ మార్పిడి అనేది కేవలం ఆపరేషన్‌తో ముగిసేది కాదని స్పష్టం చేశారు. కరెక్ట్ డోనర్‌ను సెలెక్ట్ చేసుకోవడం దగ్గర్నుంచి.. సర్జరీ తర్వాత లైఫ్ లాంగ్ ఫాలో-అప్ (Follow-up) వరకు ప్రతిదీ ముఖ్యమేనన్నారు. రోగులు డాక్టర్లు సూచించిన మెడిసిన్స్ వాడుతూ, హెల్తీ లైఫ్‌స్టైల్ మెయింటైన్ చేసినప్పుడే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని ఆయన సూచించారు.

Advertisement
Advertisement