Stock Markets | మళ్లీ శాంతి చర్చల దిశగా అమెరికా-ఇరాన్.. స్టాక్ మార్కెట్లలో జోష్..
Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు తగ్గడం, దేశవ్యాప్తంగా అనుకూలంగా కొనసాగుతున్న రుతుపవనాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపడం వంటి అంశాలు మార్కెట్లకు బలాన్నిచ్చాయి.
Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు తగ్గడం, దేశవ్యాప్తంగా అనుకూలంగా కొనసాగుతున్న రుతుపవనాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపడం వంటి అంశాలు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్లలో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు నమోదవడంతో ప్రధాన సూచీలు ఉదయం ట్రేడింగ్లో ఒక శాతం వరకు లాభపడ్డాయి. ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 800 పాయింట్లు (1.02 శాతం) పెరిగి ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 78,895.10 ని తాకింది. నిఫ్టీ 192.85 పాయింట్లు (0.79 శాతం) ఎగిసి 24,576.45 వద్ద ట్రేడైంది. రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, మెటల్, కెమికల్స్, సిమెంట్, పీఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు ఒక్క శాతం వరకు పెరిగి మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.
భారీగా క్షీణించిన చమురు ధరలు..
అయితే అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి కనిపించలేదు. మీడియా, ఫార్మా, హెల్త్కేర్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్కేర్ సూచీలు గరిష్ఠంగా 1.6 శాతం వరకు పడిపోయాయి. విస్తృత మార్కెట్లలో కూడా కొనుగోళ్ల జోరు కనిపించింది. నిఫ్టీ మైక్రోక్యాప్ 500, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీలు సుమారు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పతనం అవడం కూడా ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. అమెరికా-ఇరాన్ మళ్లీ శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తుండడంతో పెట్టుబడిదారుల్లో రిస్క్ తీసుకునే ధోరణి కనిపించింది. దీంతో కొనుగోళ్లు జోరందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర 7.06 శాతం మేర పడిపోయి బ్యారెల్కు 87 డాలర్లకు దిగి రాగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 7.27 శాతం మేర పతనమైన బ్యారెల్కు 80 డాలర్లకు చేరింది. ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయికి అనుకూల సంకేతాలు వచ్చాయి. అమెరికా డాలర్తో పోలిస్తే 23 పైసల మేర లాభపడ్డ రూపాయి 95.14 వద్ద నిలిచింది.
నిఫ్టీ మరింత పైపైకి..
నిఫ్టీ 24,500 స్థాయి పైన నిలదొక్కుకుని మరింత ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముడి చమురు ధరల పతనం, అనుకూల రుతుపవనాలు, విదేశీ పెట్టుబడిదారులు నికర కొనుగోలుదారులుగా మారడం మార్కెట్లకు బలాన్ని అందిస్తున్నాయని చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోందని, రుణాల వృద్ధి 18 శాతానికి పైగా ఉండడం, ఆటోమొబైల్ విక్రయాలు ఆశాజనకంగా ఉండడం, తొలి త్రైమాసిక కంపెనీ ఫలితాలు అంచనాలకు మించి రావడం వల్ల 2026-27 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ లాభాల వృద్ధి గత అంచనాలను మించే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Train Fire | తప్పిన ప్రాణనష్టం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం
- ●Khandala | తెలంగాణ కశ్మీర్.. చుట్టూ కొండలు.. గుట్టలు.. జాలువారే సెలయేర్లు
- ●CJP | పీఎం కేర్స్ ఫండ్పై కూడా దర్యాప్తు కోరండి.. సూరత్ ఆర్టీఐ కార్యకర్తకు సీజేపీ కౌంటర్
- ●Suicide Blast | పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి
- ●Sangameswara Temple | కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు.. మళ్లీ పూజలందుకునేది మార్చిలోనే!
- ●Srisailam | భక్తుల సౌకర్యార్థం.. శ్రీశైల మల్లికార్జునుడి దర్శన వేళల్లో మార్పులు

Train Fire | తప్పిన ప్రాణనష్టం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం

Khandala | తెలంగాణ కశ్మీర్.. చుట్టూ కొండలు.. గుట్టలు.. జాలువారే సెలయేర్లు

CJP | పీఎం కేర్స్ ఫండ్పై కూడా దర్యాప్తు కోరండి.. సూరత్ ఆర్టీఐ కార్యకర్తకు సీజేపీ కౌంటర్

Suicide Blast | పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి






