త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monda Market | మోండా మార్కెట్‌లో చోరీ… రూ.25 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాలు లూటీ

Monda Market | సికింద్రాబాద్ మోండా మార్కెట్‌ (Monda Market)లో దొంగ‌లు బంగారు షాపు తాళాలు ప‌గ‌ల‌గొట్టి ఆభ‌ర‌ణాలు చోరీ చేశారు. షాపులోని 16 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు లూటీ చేశారు. వాటి విలువ దాదాపు రూ. 25 ల‌క్ష‌లు ఉంటుంద‌ని బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

A

Hyderabad | Published On Jan 24, 2026, 1.36 pm IST

Monda Market | మోండా మార్కెట్‌లో చోరీ… రూ.25 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాలు లూటీ
Advertisement

Monda Market | త్రినేత్ర‌.న్యూస్‌ : సికింద్రాబాద్ మోండా మార్కెట్‌ (Monda Market)లో దొంగ‌లు బంగారు షాపు తాళాలు ప‌గ‌ల‌గొట్టి ఆభ‌ర‌ణాలు చోరీ చేశారు. షాపులోని 16 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు లూటీ చేశారు. వాటి విలువ దాదాపు రూ. 25 ల‌క్ష‌లు ఉంటుంద‌ని బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న ఆ ప్రాంతంలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఆ ప్రాంతంలో ఎక్కువ‌గా బంగారు, వెండి ఆభ‌ర‌ణాల దుకాణాలు ఉండ‌డంతో దుకాణాదారులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న మోండా మార్కెట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం జ‌ర్గీష్ జువెల‌రీ షాప్‌లో వివిధ ఆభ‌ర‌ణాలు త‌యారుచేస్తూ ఉంటారు. ఎప్ప‌టిలాగే శుక్ర‌వారం రాత్రి దుకాణం య‌జ‌మాని తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. శ‌నివారం ఉద‌యం వ‌చ్చి చూసేస‌రికి ష‌ట‌ర్ తాళం ప‌గ‌ల‌గొట్టి ఉంది. లోప‌లికి వెళ్లి చేసే స‌రికి సిద్ధం చేసిన 16 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు క‌నిపించ‌లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు ప‌రిశీలించ‌గా ఓ యువ‌కుడు బ్యాగుతో వెళ్తున్న దృశ్యాలు క‌నిపించాయి. ఆ వ్య‌క్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఆ ప్రాంతంలో బంగారు ఆభ‌ర‌ణాలు త‌యారు చేసే షాపులు ఎక్కువ‌. చోరీకు గురైన షాపులో సైతం బెంగాల్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన కార్మికులు ప‌నిచేస్తున్నార‌ని దుకాణ య‌జ‌మాని తెలిపారు. దీంతో తెలిసిన వారి ప‌నే అయి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement