త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cable Bridge | కేబుల్ బ్రిడ్జిపై బెంజ్ కారు బీభ‌త్సం.. వ్య‌క్తి వృతి

Cable Bridge | హైద‌రాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై (Cable Bridge) ఓ బెంజ్ కారు (Benz Car) బీభ‌త్సం సృస్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు కేబుల్ బ్రిడ్జిపై ఉన్న ఓ వ్య‌క్తి ఢీకొట్టింది.

G

Hyderabad | Published On Apr 20, 2026, 9.32 am IST

Cable Bridge | కేబుల్ బ్రిడ్జిపై బెంజ్ కారు బీభ‌త్సం.. వ్య‌క్తి వృతి
Advertisement

Cable Bridge | తినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై (Cable Bridge) ఓ బెంజ్ కారు (Benz Car) బీభ‌త్సం సృస్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు కేబుల్ బ్రిడ్జిపై ఉన్న ఓ వ్య‌క్తి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డు మృతిచెందాడు.

ఘట్‌కేసర్‌కు చెందిన శ్యామ్‌రాజ్‌(32) న్యూహఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో నివాసముంటున్నారు. ఆదివారం తెల్లవారు జామున మాదాపూర్‌ దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిపై ఆగి ఉన్నాడు. అదే స‌మ‌యంలో జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు అతివేగంగా వెళ్తున్న బెంజ్‌కారు.. అదుపుత‌ప్పి శ్యామ్‌ను ఢీకొట్టింది. దీంతో అత‌డు తీవ్రంగా గాయపడ్డాడు. కారును అక్క‌డే వ‌దిలేసిన డ్రైవ‌ర్‌.. అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితుడిని మాదాపూర్‌లోని మెడికవర్ ద‌వాఖాన‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం సాయంత్రం మరణించారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ కారు.. క్యాంటం మినరల్స్‌ అండ్‌ మెటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కోల్‌కత్తా పేరుతో రిజిస్ట్రేష‌న్ అయిందని పోలీసులు తెలిపారు. కేసు న‌మోదుచేశామ‌ని, నిందితుడి కోసం గాలిస్తున్నామ‌న్నారు.

 

Advertisement
Advertisement