త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Newborn Baby Dead Body in Flush Tank | కన్నపేగుకే కళంకం: ఆస్పత్రి వాష్‌రూమ్ ఫ్లష్ ట్యాంక్‌లో పసికందు మృతదేహం

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని రాందేవ్ రావు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓపీడీ మహిళల వాష్‌రూమ్ ఫ్లష్ ట్యాంక్‌లో ఓ నవజాత మగ శిశువు మృతదేహం లభ్యమైంది. అమానుషంగా బిడ్డను వదిలేసి వెళ్లిన కన్నతల్లి కోసం పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

J

Hyderabad | Published On Mar 31, 2026, 9.06 pm IST

Newborn Baby Dead Body in Flush Tank | కన్నపేగుకే కళంకం: ఆస్పత్రి వాష్‌రూమ్ ఫ్లష్ ట్యాంక్‌లో పసికందు మృతదేహం
Advertisement

Newborn Baby Dead Body in Flush Tank | త్రినేత్ర.న్యూస్ :  నవమాసాలు మోసి కన్నబిడ్డను గుండెలకు హత్తుకోవాల్సిన ఓ తల్లి.. రాక్షసిలా మారింది. పేగు తెంచుకుని పుట్టిన పసికందును అత్యంత దారుణంగా వాష్‌రూమ్ ఫ్లష్ ట్యాంక్‌లో పడేసి పరారైంది. సభ్యసమాజం తలదించుకునే ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వెలుగులోకి వచ్చిందిలా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట పరిధిలోని కూకట్‌పల్లి రాందేవ్ రావు ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. మంగళవారం (మార్చి 31) ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగం (OPD) వద్ద ఉన్న మహిళల వాష్ రూమ్‌ను శుభ్రం చేయడానికి ఆయా నరసమ్మ లోపలికి వెళ్లింది. క్లీన్ చేస్తున్న సమయంలో ఫ్లష్ ట్యాంకులో ఓ నవజాత మగ శిశువు మృతదేహం ఉండటాన్ని చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే తేరుకుని ఆసుపత్రి యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించింది.

ఆధారాలు దాచేందుకే ఈ దారుణం

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన గుర్తుతెలియని మహిళ.. బిడ్డకు జన్మనిచ్చి, ఎవరికీ తెలియకుండా ఆధారాలు దాచే ప్రయత్నంలో భాగంగానే పసికందును ఫ్లష్ ట్యాంకులో పడేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ప్రాణాలు లేని ఆ పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ అమానుషానికి పాల్పడిన ఆ మహిళ ఎవరో కనిపెట్టేందుకు ఆసుపత్రి ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. "అసలు ఈమె తల్లేనా?" అంటూ స్థానికులు, ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement