త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హైద‌రాబాద్‌లో ఘోరం.. కుమారుడితో క‌లిసి ప్రియుడిని క‌త్తితో పొడిచి చంపింది..

Hyderabad | ఓ వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ దారుణానికి పాల్ప‌డింది. త‌న కుమారుడితో క‌లిసి అత‌న్ని క‌త్తితో పొడిచి చంపింది.

S

Hyderabad | Published On May 4, 2026, 10.22 am IST

Hyderabad | హైద‌రాబాద్‌లో ఘోరం.. కుమారుడితో క‌లిసి ప్రియుడిని క‌త్తితో పొడిచి చంపింది..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : ఓ వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ దారుణానికి పాల్ప‌డింది. త‌న కుమారుడితో క‌లిసి అత‌న్ని క‌త్తితో పొడిచి చంపింది. ఈ దారుణం జీడిమెట్ల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని అంబేద్క‌ర్ న‌గ‌ర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ వివాహిత మ‌హిళ గ‌త కొంత‌కాలం నుంచి ఓ వ్య‌క్తితో స‌హ‌జీవ‌నంలో ఉంది. అయితే ఆమెను అత‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. స‌ద‌రు వ్య‌క్తి వేధింపులు తాళ‌లేక‌.. ఆమె దారుణానికి పాల్ప‌డింది. ఆదివారం రాత్రి అత‌నిపై కుమారుడితో క‌లిసి క‌త్తితో దాడి చేసి చంపింది. అనంత‌రం డెడ్‌బాడీని గోనెసంచిలో కుక్కి నిర్మానుష్య ప్రాంతానికి త‌ర‌లించేందుకు య‌త్నిస్తుండ‌గా, పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

త‌ల్లీకుమారుడి నుంచి డెడ్‌బాడీతో పాటు క‌త్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement