త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA Ranganath | ఆ బండ‌పై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ ప‌చ్చ‌ద‌నం పెంచండి: రంగ‌నాథ్‌

HYDRAA Ranganath | సున్నం చెరువుకు ఆనుకుని ఉన్న బండ‌పై వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాల‌ని, చెరువు చుట్టూ ప‌చ్చ‌ద‌నం ఇంకా పెర‌గాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశించారు. ఇక్క‌డ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఉట్టిప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

S

Hyderabad | Published On Sep 5, 2026, 7.03 pm IST

HYDRAA Ranganath | ఆ బండ‌పై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ ప‌చ్చ‌ద‌నం పెంచండి: రంగ‌నాథ్‌
Advertisement

HYDRAA Ranganath | త్రినేత్ర‌.న్యూస్‌: సున్నం చెరువుకు ఆనుకుని ఉన్న బండ‌పై వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాల‌ని, చెరువు చుట్టూ ప‌చ్చ‌ద‌నం ఇంకా పెర‌గాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశించారు. ఇక్క‌డ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఉట్టిప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. శ‌నివారం మాదాపూర్‌లోని త‌మ్మిడికుంట‌, సున్నం చెరువుల అభివృద్ధి ప‌నుల‌ను క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న‌ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

త‌మ్మిడికుంట‌లో పేరుకుపోయిన బ‌యో వ్య‌ర్థాల‌ను తొల‌గించాం. మురుగునీటిని పూర్తిగా తొల‌గించి.. ఎక్క‌డ కూడా పాత ఆన‌వాళ్లు లేకుండా అభివృద్ధి చేశాం. ఇక్క‌డి చెరువుకు మెట‌ల్ చార్మినార్ వైపు ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను వేరు చేసే యూనిట్లున్నాయి. వీటితో చెరువుకి కాలుష్యం ముప్పు ఉంటుంద‌ని పొల్యూష‌న్ కంట్రోల్‌బోర్డు కూడా ఇప్ప‌టికే హెచ్చ‌రించింది. వెంట‌నే అక్క‌డ ప్లాస్టిక్ వ్య‌ర్థాల సేక‌ర‌ణ‌, వేర్వేరు చేసే కేంద్రాల‌ను తొల‌గించాలి అని రంగ‌నాథ్‌ అధికారుల‌ను ఆదేశించారు.

అంత‌కుముందు కృష్ణ‌కాంత్ పార్కును హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. రెండో విడ‌త చేప‌ట్టిన 14 చెరువుల్లో ఒక‌టిగా ఉన్న కృష్ణ‌కాంత్ పార్కు చెరువు లోతుతో పాటు విస్తీర్ణం పెరిగితే వ‌ర‌ద‌ను చాలావ‌ర‌కు క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చన్నారు. ఇక్క‌డ‌కు నేరుగా వ‌ర‌ద చేరితే కృష్ణాన‌గ‌ర్‌, యూసుఫ్‌గూడ ప్రాంతాల‌తో పాటు.. చెరువు కింద ఉన్న శ్రీ‌నివాస‌న‌గ‌ర్‌, అమీర్‌పేట ప్రాంతాలు నీట మునిగే ప్ర‌మాదం త‌ప్పుతుంద‌ని వివ‌రించారు.

Advertisement
Advertisement