త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MMTS | ఖైర‌తాబాద్ గ‌ణేశ్‌.. భ‌క్తుల‌కు అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు

MMTS | ఖైర‌తాబాద్ బ‌డా గ‌ణేశ్‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తున్నారు. హైద‌రాబాద్ నుంచే కాదు.. తెలంగాణ న‌లుమూలల‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకుంటున్నారు.

S

Hyderabad | Published On Sep 19, 2026, 7.34 am IST

MMTS | ఖైర‌తాబాద్ గ‌ణేశ్‌.. భ‌క్తుల‌కు అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు
Advertisement

MMTS | త్రినేత్ర‌.న్యూస్ : ఖైర‌తాబాద్ బ‌డా గ‌ణేశ్‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తున్నారు. హైద‌రాబాద్ నుంచే కాదు.. తెలంగాణ న‌లుమూలల‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకుంటున్నారు. రోజుకు ల‌క్ష‌కు పైగానే భ‌క్తులు ఖైర‌తాబాద్ లంబోద‌రుడిని ద‌ర్శించుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో భ‌క్తుల‌కు ర‌వాణా సౌక‌ర్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ఆర్టీసీ, ఇటు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది.

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఖైర‌తాబాద్ రైల్వే స్టేష‌న్ మీదుగా రోజుకు 22 ఎంఎంటీఎస్ రైళ్ల‌ను న‌డుపుతోంది. సికింద్రాబాద్, నాంప‌ల్లి, లింగంప‌ల్లి, ఫ‌ల‌క్‌నుమా, మేడ్చ‌ల్, రామ‌చంద్రాపురం రైల్వే స్టేష‌న్ల నుంచి అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి రోజు ఉద‌యం 5.15 నుంచి రాత్రి 10.30 గంట‌ల‌కు రైళ్లు రాక‌పోక‌లు కొన‌సాగించ‌నున్నాయి.

Advertisement
Advertisement