త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shamshabad | కల్వ‌ర్టును ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే న‌లుగురు మృతి

Shamshabad | రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి క‌ల్వ‌ర్టును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురిలో న‌లుగురు స్పాట్‌లోనే చ‌నిపోయారు.

S

Hyderabad | Published On Sep 19, 2026, 6.43 am IST

Shamshabad | కల్వ‌ర్టును ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే న‌లుగురు మృతి
Advertisement

Shamshabad | త్రినేత్ర‌.న్యూస్ : రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి క‌ల్వ‌ర్టును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురిలో న‌లుగురు స్పాట్‌లోనే చ‌నిపోయారు. మ‌రొక‌రికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల‌ను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా న‌వాబుపేట మండ‌లం చౌడురు గ్రామానికి చెందిన వార‌ని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement