త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chilkuru Balaji Temple | గండిపేట‌లో.. వ‌ర్షాల కోసం 108 సార్లు వ‌రుణ జ‌ప మంత్రాలు..

Chilkuru Balaji Temple | తెలంగాణ వ‌ర్షాభావ ప‌రిస్థితులు కొన‌సాగుతున్న తెలిసిందే. క‌రువు తాండ‌విస్తున్న నేప‌థ్యంలో వ‌ర్షాలు స‌మృద్ధిగా కుర‌వాల‌ని చిలుకూరు బాలాజీ ఆల‌య పండితులు వ‌రుణ జ‌పం నిర్వ‌హించారు. గండిపేట ఉస్మాన్ సాగ‌ర్ జ‌లాశ‌యంలో వైదిక అనుష్ఠానం చేశారు.

S

Hyderabad | Published On Jul 21, 2026, 2.57 pm IST

Chilkuru Balaji Temple | గండిపేట‌లో.. వ‌ర్షాల కోసం 108 సార్లు వ‌రుణ జ‌ప మంత్రాలు..
Advertisement

Chilkuru Balaji Temple | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ వ‌ర్షాభావ ప‌రిస్థితులు కొన‌సాగుతున్న తెలిసిందే. క‌రువు తాండ‌విస్తున్న నేప‌థ్యంలో వ‌ర్షాలు స‌మృద్ధిగా కుర‌వాల‌ని చిలుకూరు బాలాజీ ఆల‌య పండితులు వ‌రుణ జ‌పం నిర్వ‌హించారు. గండిపేట ఉస్మాన్ సాగ‌ర్ జ‌లాశ‌యంలో వైదిక అనుష్ఠానం చేశారు. కలశం పట్టుకొని చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌ నేతృత్వంలో అర్చకులు 108 సార్లు వరుణ జప మంత్రాలు చదివారు. ఈ వ‌రుణ జ‌పం మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది.

వేద భావ‌నానికి చెందిన డాక్ట‌ర్ వీ శ్రీరామ ఘ‌న‌పాఠి నేతృత్వంలోని రుత్వికులు.. వ‌రుణ దేవుడు, ఇంద్రుని అనుగ్ర‌హం పొందేలా చిలుకూరు బాలాజీని ప్రార్థించారు. ఈ సంద‌ర్భంలోనే తైత్తీరీయ సంహిత‌లోని మంత్రాల‌తో వ‌రుణ జ‌ప మంత్ర‌లు ప‌ఠించారు. ముఖ్యంగా ఎండిపోతున్న పంట‌ల‌ను కాపాడాల‌ని, న‌దులు, జ‌లాశ‌యాల‌కు భారీ వ‌ర‌ద రావాల‌ని సామూహిక ప్రార్థ‌న నిర్వ‌హించారు.

Advertisement
Advertisement