త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు.. పెండ్ల‌యిన వ్య‌క్తి మాస్ట‌ర్ ప్లాన్‌..

G

Hyderabad | Published On Feb 22, 2026, 8.59 am IST

Hyderabad | ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు.. పెండ్ల‌యిన వ్య‌క్తి మాస్ట‌ర్ ప్లాన్‌..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: అత‌ను ఓ ప‌బ్‌లో ప‌ర్చేజ్ మేనేజ‌ర్‌. ప‌నిచేస్తున్న చోట‌ ఓ యువ‌తిపై మ‌న‌సుప‌డ్డాడు. గ‌త కొంత కాలంగా ఆమెతో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. అయితే అప్ప‌టికే అతనికి పెండ్లి అయింది. ప్రేయ‌సితో రెండు రోజులు ప్ర‌త్యేకంగా గ‌డ‌పాల‌నుకున్నాడు. దీంతో ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. త‌న‌ను ఎవ‌రో కిడ్నాప్ చేసిన‌ట్లు డ్రామా ఆడాడు. పోలీసులు ఎంట్రీ ఇవ్వ‌డంతో అస‌లు క‌థ బ‌య‌ట‌ప‌డింది..

రావూరి పూర్ణ‌చంద‌ర్ (34) అనే వ్య‌క్తి  హైద‌రాబాద్‌ (Hyderabad) మాదాపూర్‌లోని ఓ ప‌బ్‌లో ప‌ర్చేజ్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. రామంతాపూర్ డివిజ‌న్‌లోని గాంధీన‌గ‌ర్ జ‌న‌ప్రియ అపార్టుమెంటులో ఉంటున్నారు. అత‌నికి భార్య‌, తొమ్మిదేండ్ల‌ కూతురు ఉన్న‌ది. గురువారం రాత్రి స్నేహితులు వ‌చ్చార‌ని చెప్పి త‌న ఫోన్‌ను ఇంట్లోనే ఉంచి డోర్‌బ‌య‌ట బేడం పెట్టి వెళ్లాడు. అపార్ట్‌మెంట్ నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చి ఇద్దరు అమ్మాయిలు, మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోయారు. ఉదయం నిద్ర లేచిన భార్య.. భర్త కనిపించకపోవడంతో అత‌నికి ఫోన్ చేసింది. రెండు రోజులుగా స్విచ్చాఫ్ వ‌స్తుండ‌టంతో ఆందోళ‌నకు గురైంది. అపార్ట్‌మెంట్‌ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించ‌గా ముగ్గురు వ్య‌క్తులు అత‌డిని తీసుకెళ్తున్న‌ట్లు గ‌మ‌నించింది. దీంతో త‌న భ‌ర్త‌ను కిడ్నాప్‌ చేశారని ఉప్ప‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. త‌న భ‌ర్త ఆచూకీ క‌నుక్కోవాల‌ని వారిని వేడుకుంది. అతను పనిచేసే పబ్‌కు వెళ్లి తన భర్తను కిడ్నాప్‌ చేశారని చెప్పింది. దీంతో పబ్‌ నిర్వాహకులు కూడా మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆర్ధ‌రాత్రి వ‌చ్చిన యువ‌తుల్లో ఒక‌రిని గుర్తించారు. ఆమెను విచారించ‌గా అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. గ‌త కొంత‌కాలంగా బెంగాలీ యువతితో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. వారి ఫోన్‌ నంబర్‌ లోకేషన్‌ను పరిశీలించగా ఒడిశాలో ఉన్నట్లు తెలిసింది. దీంతో ప్రియురాలితే గ‌డిపేందుకు పబ్‌లో పనిచేసే యువతులతో కలిసి కిడ్నామ్ డ్రామా ఆడాడ‌ని గుర్తించారు.

Advertisement
Advertisement