త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | కారుతో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో న్యాయ‌వాది ఖాజా మొయినుద్దీన్ మృతి..

Hyderabad | హైద‌రాబాద్ (Hyderabad) మాస‌బ్‌ట్యాంక్‌లో ప్ర‌త్య‌ర్థులు కారుతో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో న్యాయ‌వాది ఖాజా మొయినుద్దీన్ మృతిచెందారు.

G

Hyderabad | Published On May 23, 2026, 1.10 pm IST

Hyderabad | కారుతో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో న్యాయ‌వాది ఖాజా మొయినుద్దీన్ మృతి..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ (Hyderabad) మాస‌బ్‌ట్యాంక్‌లో ప్ర‌త్య‌ర్థులు కారుతో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో న్యాయ‌వాది ఖాజా మొయినుద్దీన్ మృతిచెందారు. శ‌నివారం ఉద‌యం మాసబ్ ట్యాంక్‌లోని త‌న నివాసం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మొయినుద్దీన్‌ను.. ప‌థ‌కం ప్ర‌కారం అప్ప‌టికే అక్క‌డ వేచిఉన్న దుండ‌గులు ఆయ‌న‌ను కారుతో ఢీకొట్టారు. దీంతో ఆయ‌న గాల్లోకి ఎగిరిప‌డ్డారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు హుటాహుటిన ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

అయితే చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మ‌ర‌ణించారు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Advertisement
Advertisement