త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను తెచ్చి వారి ఉద్యోగానికి భ‌ద్ర‌త లేకుండా చేస్తున్నారు : త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌

Talasani Srinivas Yadav | ఆర్టీసీ ఉద్యోగుల (RTC employees) డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ఆమోదించి స‌మ్మెను (RTC strike) విర‌మింప‌జేయాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) డిమాండ్ చేశారు.

D

Hyderabad | Published On Apr 22, 2026, 3.51 pm IST

Talasani Srinivas Yadav | ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను తెచ్చి వారి ఉద్యోగానికి భ‌ద్ర‌త లేకుండా చేస్తున్నారు : త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌
Advertisement

Talasani Srinivas Yadav | ఆర్టీసీ ఉద్యోగుల (RTC employees) డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ఆమోదించి స‌మ్మెను (RTC strike) విర‌మింప‌జేయాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని IDH కాలనీలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి వారి ఉద్యోగానికి భద్రత లేకుండా చేస్తున్నారని మండిప‌డ్డారు.

అవసరమైన శిక్షణ ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగులనే ఎలక్ట్రికల్ బస్సుల్లో నియమించాలని అన్నారు. ఎలక్ట్రికల్ బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లుగా ప్రైవేటు వ్యక్తుల నియామకం, ఆర్టీసీ డిపోలు, ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారని మండిపడ్డారు. సమ్మె కారణంగా బస్సులు నడవక విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మహిళలు ఎలా ప్రయాణం చేయాలో చెప్పాలని ప్ర‌భుత్వాన్ని త‌ల‌సాని ప్ర‌శ్నించారు.

Also Read..

తెలంగాణ మహిళలకు ‘ఫ్రీ’ షాక్‌..!

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

ఆర్‌బీఐ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు.. రూ.1 ల‌క్ష వ‌ర‌కు రిక‌రింగ్ పేమెంట్ల‌కు నో ఓటీపీ..

Advertisement
Advertisement