BRSV | ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే దుష్ప్రచారం: బీఆర్ఎస్వీ
BRSV | తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే హరీశ్రావుపై ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. హరీశ్పై తప్పుడు ప్రచారం చేస్తున్న అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్రెడ్డిలు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు
BRSV | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే హరీశ్రావుపై ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. హరీశ్పై తప్పుడు ప్రచారం చేస్తున్న అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్రెడ్డిలు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారిని బయట తిరుగనీయబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్వీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా రాజకీయాల్లో మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్న హరీశ్ రావుపై ఉద్దేశపూర్వకంగానే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఆయనకున్న మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశారని అభిప్రాయపడ్డారు. అందుకే హరీశ్ వారికి లీగల్ నోటీసులు పంపారన్నారు.
పుట్టినరోజు వచ్చినా, మొక్కులు తీర్చుకోవాలన్నా కుటుంబ సమేతంగా గుడికి వెళ్లడం మన సంప్రదాయమని గుర్తు చేశారు. అలా భక్తిశ్రద్ధలతో గుడికి వెళ్లిన విషయాన్ని వక్రీకరించి.. దేవుళ్లను, పవిత్రమైన దేవాలయాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం వారి సంకుచిత బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనన్నారు. ఆధారాలు లేకుండా చేసిన ఈ తప్పుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయే వార్తా ఛానెళ్లు, ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఆరోపణలు చేశారో.. అదే మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచించారు. అంతేకాకుండా సోషల్ మీడియా, వెబ్సైట్లు, ప్రెస్ ఆర్కైవ్స్, ఇతర డిజిటల్ లేదా ప్రింట్ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ తప్పుడు వీడియోలను, పోస్టులను తక్షణమే తొలగించాలన్నారు. నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, వీడియోలు డిలీట్ చేయించలేక పోయినా.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, చటారి దశరథ్, కాటం శివ, బొల్లు నాగరాజు యాదవ్, కొంపల్లి నరేష్, మిథున్ ప్రసాద్, శ్రీకాంత్, నాగేందర్ రావు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Chinmayi | జయలలితనూ అవమానించారు - త్రిషకు క్షమాపణ చెప్పాల్సిందే- చిన్మయి, కుష్బూ డిమాండ్
- ●T Fiber | ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు
- ●Arvind Kejriwal | ప్రధాని నివాసం వైపు ఆప్ చేపట్టిన మార్చ్ను అడ్డుకున్న పోలీసులు.. మేము టెర్రరిస్ట్లం కాదంటూ కేజ్రీవాల్ ఆగ్రహం
- ●Mahesh Kumar Goud | హరీశ్రావు క్షుద్రపూజలు చేస్తుండు
- ●WhatsApp | వాట్సాప్లో భారీ గందరగోళం.. కారణం లేకుండానే వేల ఖాతాల సస్పెన్షన్..
- ●Murder | హైదరాబాద్లో దారుణం.. కొబ్బరికాయలు నరికే కత్తితో పొడిచి చంపారు

Chinmayi | జయలలితనూ అవమానించారు - త్రిషకు క్షమాపణ చెప్పాల్సిందే- చిన్మయి, కుష్బూ డిమాండ్

T Fiber | ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు

Arvind Kejriwal | ప్రధాని నివాసం వైపు ఆప్ చేపట్టిన మార్చ్ను అడ్డుకున్న పోలీసులు.. మేము టెర్రరిస్ట్లం కాదంటూ కేజ్రీవాల్ ఆగ్రహం

Mahesh Kumar Goud | హరీశ్రావు క్షుద్రపూజలు చేస్తుండు




