త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | హైద‌రాబాద్‌లో దారుణం.. కొబ్బ‌రికాయ‌లు నరికే క‌త్తితో పొడిచి చంపారు

Murder | హైద‌రాబాద్ న‌గ‌రంలోని సైదాబాద్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణం జ‌రిగింది. సింగ‌రేణి కాల‌నీలో హ‌మేర్‌(35) అనే యువ‌కుడిని కొబ్బ‌రి కాయ‌లు న‌రికే క‌త్తితో పొడిచి చంపారు.

S

Hyderabad | Published On Aug 4, 2026, 3.20 pm IST

Murder | హైద‌రాబాద్‌లో దారుణం.. కొబ్బ‌రికాయ‌లు నరికే క‌త్తితో పొడిచి చంపారు
Advertisement

Murder | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని సైదాబాద్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణం జ‌రిగింది. సింగ‌రేణి కాల‌నీలో హ‌మేర్‌(35) అనే యువ‌కుడిని కొబ్బ‌రి కాయ‌లు న‌రికే క‌త్తితో పొడిచి చంపారు. అంద‌రూ చూస్తుండ‌గానే క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వ్యక్తిగత విభేదాలే కారణమా? లేక మరే కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హమేర్‌పై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసింది. కాగా, మృతుడు, నిందితుడు ఇద్దరూ గంజాయి సేవించే యువకుల బృందానికి చెందినవారిగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement