Telangana Police Insurance | విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి.. బాధిత కుటుంబానికి కోటి బీమా చెక్ అందజేసిన డీజీపీ
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ చరణ్ కుమార్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. డీజీపీ సీవీ ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు.
- విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చరణ్కుమార్ (పీసీ-8968)
- బాధిత కుటుంబ సభ్యులకు భరోసాగా రూ.1 కోటి ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన డీజీపీ సీవీ ఆనంద్
- మహారాష్ట్రలో జరిగిన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతిచెందిన మల్కాజిగిరి కానిస్టేబుల్
- ఎస్బీఐ (SBI) అధికారులతో సమన్వయం చేసి బీమా క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేసిన ఈగల్ ఫోర్స్ ఉన్నతాధికారులు
Telangana Police Insurance | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ (Telangana) పోలీస్ శాఖ తమ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని మరోసారి నిరూపితమైంది. విధి నిర్వహణలో ఉంటూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మల్కాజిగిరి (Malkajgiri) ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్కుమార్ కుటుంబానికి అండగా నిలిచింది. మృతుని కుటుంబ సభ్యులకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) సోమవారం రూ. 1 కోటి ఇన్సూరెన్స్ (Insurance) చెక్కును అందజేశారు.
అసలేం జరిగిందంటే?
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 2018 బ్యాచ్కు చెందిన చరణ్కుమార్.. ఈగల్ ఫోర్స్లో (Eagle Force) డిప్యూటేషన్పై విధులు నిర్వర్తించేవారు. 2025 సెప్టెంబర్ 22-23 తేదీల మధ్య అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని వస్తుండగా మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఆయన తలకు, కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే విషాదం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఫస్ట్ ఎయిడ్ (First aid) చేయించి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు (Yashoda Hospital) తరలించారు. డాక్టర్ల సూచన మేరకు ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ (Plastic surgery) కూడా చేశారు. చికిత్స అనంతరం కోలుకున్నాడని భావించి అక్టోబర్ 28న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ, ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే చరణ్కుమార్ సృహతప్పి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు మళ్లీ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అండగా నిలిచిన పోలీస్ శాఖ
కానిస్టేబుల్ అకాల మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఎస్పీ రఘువీర్, అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి తదితరులు ఎస్బీఐ (SBI) బ్యాంక్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని బీమా క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు కోటి రూపాయల చెక్కును బాధితులకు అందజేసిన డీజీపీ ఆనంద్.. చరణ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MLC Shambhipur Raju | యువ సంగ్రామ సభకు ఎందుకు అనుమతివ్వరు.. ఎన్ని అడ్డంకులున్నా సక్సెస్ చేస్తం
జులై 17, 2026

CV Anand | ఆ అధికారిని సస్పెండ్ చేయండి.. సైబరాబాద్ సీపీకి డీజీపీ ఆదేశం..
జులై 13, 2026

RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జులై 8, 2026
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత



