CPM Telangana | అవి ప్రమాదకర చట్టాలు.. లేబర్ కోడ్లతో ఉద్యోగ భద్రత ఉండదు
శాంతి పేరుతో తీసుకొస్తున్న న్యూక్లియర్ లయబులిటీ బిల్లు విదేశీ సంస్థలు కంపెనీలు స్థాపించే అవకాశాన్ని కలిస్తుందనీ, ప్రమాదాలు జరిగితే కంపెనీల బాధ్యత కాదని ఆ చట్టంలో పేర్కొనటం దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు.
- పార్లమెంట్లో ప్రమాదకర చట్టాలకు ఆమోదం
- లేబర్ కోడ్లతో ఉద్యోగ భద్రత కరువు
- పంపిణీ వ్యవస్థను ప్రయివేటుకప్పగించేందుకే విద్యుత్ సవరణ చట్టం
- 'జీ రాం జీ' చట్టంతో సామాజిక భద్రతకు తూట్లు
- ఫోజులకే ప్రజల ముందు దేశభక్తి
- నిర్ణయాల్లో కార్పొరేట్ల భక్తి
- శాంతి బిల్లు దేశానికి అత్యంత ప్రమాదకరం
- వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు
- మోదీ సర్కారు చేతిలో పావుగా ఈసీఐ
-సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
- సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ పాలకమండళ్లకు శుభాకాంక్షలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి విరివిగా నిధులివ్వాలి
- పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలి
- రామారావు హత్యకేసులో జాప్యం తగదు
- హంతకులను వెంటనే శిక్షించాలి
- అభిప్రాయాలను వ్యక్తపరిచే వారిపై ఎన్ఐఏ కేసులు సరిగాదు
-సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
CPM Telangana |తాజాగా ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో దేశానికే అత్యంత ప్రమాదకరమైన నాలుగు చట్టాలకు మోదీ సర్కారు ఆమోద ముద్ర వేసుకున్నదనీ, వాటి పరిణామాలు దేశ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించబోతున్నాయని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు హెచ్చరించారు. వాటికి వ్యతిరేకంగా కలిసొచ్చే శక్తులన్నింటినీ, పార్టీలను కలుపుకుని దేశవ్యాప్త పోరాటాలను నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జ్యోతితో కలిసి రాఘవులు మాట్లాడారు. కార్పొరేట్లకు అధిక లాభాలు గడించేలా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. కోడ్లతో కార్మికులు సమ్మె హక్కును కోల్పోతారనీ, ఉద్యోగ భద్రత ఉండదనీ, కనీస వేతనాల కోసం కార్మికులు బేరసారాలు ఆడే హక్కును కోల్పోతారని వివరించారు. ఈజ్ఆఫ్ డూయింగ్ మెథడ్ అంటే కార్మికుల హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ విద్యుత్ పంపిణీ వ్యవస్థ 99 శాతం ప్రభుత్వ ఆధీనంలో నడిచేదనీ, దాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేం
సబ్కా బీమా సబ్కా రక్ష కాదు... సబ్కీ బీమా కరోడ్పతికా రక్ష
సబ్కా బీమా సబ్కా రక్ష కాదు... సబ్కీ బీమా కరోడ్పతికా రక్ష అనే ఇన్సూరెన్స్ చట్టంలో మార్పులున్నాయనీ, విదేశీ సంస్థలకు ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని మోదీ సర్కారు కల్పించిందని రాఘవులు విమర్శించారు. శాంతి పేరుతో తీసుకొస్తున్న న్యూక్లియర్ లయబులిటీ బిల్లు విదేశీ సంస్థలు కంపెనీలు స్థాపించే అవకాశాన్ని కలిస్తుందనీ, ప్రమాదాలు జరిగితే కంపెనీల బాధ్యత కాదని ఆ చట్టంలో పేర్కొనటం దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. పర్యావరణం దెబ్బతిన్నా... మనుషులు చచ్చినా సరేగానీ కార్పొరేట్ల లాభాలే ముఖ్యమన్నట్టు మోదీ సర్కారు వ్యవహరించడం తగదన్నారు. ప్రజల ముందు దేశభక్తి ఫోజులు కొడుతూ.. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల భక్తిని మోదీ సర్కారు చాటుతున్నదని విమర్శించారు. నిజమైన దేశభక్తులు ఎన్డీఏ, దాని మిత్రపక్షాలు కాదనీ, దేశ రక్షణ కోసం కొట్లాడుతున్న కమ్యూనిస్టులు, లౌకిశక్తులు, ప్రజలు నిజమైన దేశభక్తులని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసం తాము చేపట్టబోయే పోరాటాల్లో అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు. తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభమైందనీ, త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని గ్యానేశ్ కుమార్ ప్రకటించారనీ, సర్ పేరుతో బీజేపీకి మేలు చేసే నిర్ణయాలను ఈసీ తీసుకుంట
CPM Telangana |యూరియా యాప్ను ఎత్తేసి పాతపద్ధతిలోనే యూరియా ఇవ్వాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ... నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో వారంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. ఓఆర్ఆర్ అవతలకు పరిశ్రమలను తరలించి ఆ భూములను పారిశ్రామికవేత్తలకే అప్పగించాలని చూడటం సరికాదన్నారు. ఆ పేరుతో రూ.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రూ.5వేల కోట్లకే పారిశ్రామిక వేత్తలకు కట్టబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపై అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించారు. ఆ భూములను ప్రజా ప్రయోజనాల కోసం, పేదలకు ఇండ్లను కట్టించడం కోసం ఉపయోగించాలని కోరారు. యూరియా యాప్ను ఎత్తేసి పాతపద్ధతిలోనే యూరియాను అందజేయాలని డిమాండ్ చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్ బోర్డుకు వేరే ప్రాంతంలో భూములు అప్పగించి దాన్ని జీహెచ్ఎంసీలో కలపాలని కోరారు. ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) నేతను కిరాయి గుండాలతో హత్య చేయించిన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఒత్తిడితో విచారణలో పోలీసులు తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలనూ కలుపుకుని కేంద్రంపై పోరాటం చేయాలని కోరారు. గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. అభిప్రాయాలను వ్యక్తపరిస్తే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిరోజూ ఏదో ఒక చోట మోదీ, అమిత్షా, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ఎన్ఐఏను నిలదీశారు. ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 90 శాతం పాలమూరు రంగారెడ్డి పూర్తయిందని కేసీఆర్ చెప్పటం అవాస్తమన్నారు. అదే సమయంలో మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు కాంగ్రెస్ సర్కారూ నిధులను సరిగా కేటాయించడం లేదని ఎత్తిచూపారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులపై కాలయాపనలు, విమర్శలు మాని నిధులు కేటాయించి పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






