త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VC Sajjanar vs RS Praveen Kumar | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సీపీ సజ్జనార్ ‘లీగల్’ వార్నింగ్.. 48 గంటల్లో ఆధారాలు ఇవ్వాలని నోటీసు

తనపై నేరారోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించేలా మాట్లాడినందుకు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చట్టపరమైన నోటీసులు జారీ చేశారు.

J

Hyderabad | Published On Jan 24, 2026, 6.58 am IST

VC Sajjanar vs RS Praveen Kumar | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సీపీ సజ్జనార్ ‘లీగల్’ వార్నింగ్.. 48 గంటల్లో ఆధారాలు ఇవ్వాలని నోటీసు

సంక్షిప్త సారాంశం

సిట్ (SIT) చీఫ్‌పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను సీపీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. తనపై ఏడు కేసులు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 48 గంటల్లోగా ఆధారాలు సమర్పించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Advertisement

VC Sajjanar vs RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్: మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ (BRS) కీలక నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సిట్ (SIT) చీఫ్ వీసీ సజ్జనార్ గట్టి షాక్ ఇచ్చారు. తనపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినందుకు గాను సజ్జనార్ ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేశారు.

అసలు వివాదం ఏమిటి?

శుక్రవారం మీడియా సమావేశంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్ (సజ్జనార్) పైనే ఏడు (07) క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన విచారణ అధికారిగా ఉండటం సరికాదని ఆరోపించారు. అంతేకాకుండా, సజ్జనార్‌పై విచారణకు మరో సిట్ వేయాలని డిమాండ్ చేశారు.

నోటీసులో ఏముంది?

ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను సీపీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయడం వల్ల సిట్ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, జరుగుతున్న విచారణకు ఆటంకం కలుగుతుందని స్పష్టం చేశారు.

48 గంటల గడువు

నోటీసు అందిన రెండు రోజుల (48 గంటల) లోపు ఆరోపించిన ఏడు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని సజ్జనార్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా క్రైమ్ నంబర్లు (Crime Numbers), పోలీస్ స్టేషన్ల పేర్లు, మోపబడిన సెక్షన్లు, కేసు నమోదైన తేదీ, ప్రస్తుతం ఆ కేసులు ఏ దశలో ఉన్నాయి?, ఎఫ్ఐఆర్ (FIR) లేదా కోర్టు పత్రాల కాపీలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలన్నారు.

చర్యలు తప్పవు

నిర్దేశించిన గడువులోగా సరైన ఆధారాలు చూపని పక్షంలో.. పరువు నష్టం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించినందుకు గాను సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఇద్దరు ఐపీఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తుల మధ్య ఈ న్యాయపోరాటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, పోలీస్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

https://x.com/SajjanarVC/status/2014730565120098485

 

Advertisement

తాజావార్తలు

Advertisement