త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ashada Masam Bonalu | ఆగ‌స్టులో సికింద్రాబాద్ ఉజ్జ‌యిని బోనాలు.. త‌ల‌సానికి లేఖ అంద‌జేత‌

Ashada Masam Bonalu | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్స‌వాల తేదీలను ప్ర‌క‌టించారు. ఆగస్టు 2వ తేదీన ఈ వేడుక‌లు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

S

Hyderabad | Published On Jun 16, 2026, 1.18 pm IST

Ashada Masam Bonalu | ఆగ‌స్టులో సికింద్రాబాద్ ఉజ్జ‌యిని బోనాలు.. త‌ల‌సానికి లేఖ అంద‌జేత‌
Advertisement

Ashada Masam Bonalu త్రినేత్ర‌.న్యూస్‌: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్స‌వాల తేదీలను ప్ర‌క‌టించారు. ఆగస్టు 2వ తేదీన ఈ వేడుక‌లు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు.

ఈ సందర్భంగా బోనాల ఉత్సవాల వివరాలను ఆయ‌న‌కు తెలియ‌జేశారు. జులై 19వ తేదీన ఘటాల ఊరేగింపు ఉంటుంద‌ని, ఆగస్టు 2న అమ్మవారికి బోనాల సమర్పించ‌నున్న‌ట్లు చెప్పారు. 3న రంగం (భవిష్య వాణి) ఉంటుంద‌ని మ‌నోహ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రాంమోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement