త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ambulance | రోగిని తీసుకెళ్లాల‌ని చెప్పారు.. అంబులెన్సుతో ఉడాయించారు..

Ambulance | రోగిని తీసుకెళ్లాల‌ని అంబులెన్స్ (Ambulance) ర‌ప్పించారు. డ్రైవ‌ర్‌ను బ‌ల‌వంతంగా దించారు. అంబులెన్సుతో ఉడాయించిన ఘ‌ట‌న మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది.

G

Hyderabad | Published On May 16, 2026, 10.40 am IST

Ambulance | రోగిని తీసుకెళ్లాల‌ని చెప్పారు.. అంబులెన్సుతో ఉడాయించారు..
Advertisement

Ambulance | త్రినేత్ర‌.న్యూస్‌: రోగిని తీసుకెళ్లాల‌ని అంబులెన్స్ (Ambulance) ర‌ప్పించారు. డ్రైవ‌ర్‌ను బ‌ల‌వంతంగా దించారు. అంబులెన్సుతో ఉడాయించిన ఘ‌ట‌న మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు చెందిన న‌రేశ్ చెంగిచెర్లలోని శ్రీఎస్‌వీఎస్ ద‌వాఖాన‌లో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 12న అంబులెన్స్ కోసం హాస్పిట‌ల్‌ సిబ్బందికి ఫోన్ వ‌చ్చింది. దీంతో శ్రీనివాస్ అంబులెన్స్‌తో లొకేషన్‌కు వెళ్లారు.

అక్కడ ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్‌లో ఎక్కారు. మహిళకు కడుపునొప్పి ఉంద‌ని కామినేని ద‌వాఖానకు తీసుకెళ్లాలని కోరారు. అయితే కొద్దిసేప‌టి త‌ర్వాత త‌మ‌ సోదరుడు వస్తున్నాడని చెప్పి సీపీఆర్‌ఐ రోడ్డులోని నిర్మానుష్య ప్రాతంతో అంబులెన్స్‌ను ఆపారు. ఈ క్రంలో మరో ఆద్దరు వ్యక్తులు వచ్చి డ్రైవర్‌ను బలవంతంగా కిందకు దింపేశారు. అనంత‌రం ఐదుగురూ కలిసి అంబులెన్సుతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు న‌మోదుచేసిన మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తుంన్నారు.

 

Advertisement
Advertisement