త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | హైద‌రాబాద్‌లో విషాదం.. ఆరో అంత‌స్తు నుంచి దూకి వివాహిత ఆత్మ‌హ‌త్య‌

Suicide | హైద‌రాబాద్ న‌గ‌రంలోని కేపీహెచ్‌బీలో విషాదం నెల‌కొంది. కేర‌ళ‌కు చెందిన ఓ వివాహిత ఆరో అంత‌స్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

S

Hyderabad | Published On Aug 24, 2026, 9.39 pm IST

Suicide | హైద‌రాబాద్‌లో విషాదం.. ఆరో అంత‌స్తు నుంచి దూకి వివాహిత ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Suicide | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని కేపీహెచ్‌బీలో విషాదం నెల‌కొంది. కేర‌ళ‌కు చెందిన ఓ వివాహిత ఆరో అంత‌స్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న సోమ‌వారం సాయంత్రం 3.47 గంట‌ల స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు అక్క‌డున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది.

కేపీహెచ్‌బీ ఎస్ఐ శ‌శిధ‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కేర‌ళ‌లోని కానూర్‌కు చెందిన సోను పురుషోత్త‌మ్‌కు శీత‌ల్‌(32)కు ఆరేండ్ల క్రితం పెళ్లైంది. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. సోను పురుషోత్త‌మ్ హైద‌రాబాద్‌లోనే ఎస్బీఐలో డీఎంగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. సోను త‌న భార్య, కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో ఉంటున్నారు.

అయితే శీత‌ల్ గ‌త కొంత‌కాలంగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఐదో అంత‌స్తు నుంచి ఆరో అంత‌స్తుకు ఆమె మెట్ల మార్గంలో వెళ్లారు. మెట్ల‌పై 10 నిమిషాల పాటు కూర్చున్న అనంత‌రం టెర్ర‌స్ పైకి ఎక్కి కింద‌కు దూకేసింది. దీంతో శీత‌మ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement
Advertisement