త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ticket Rate Hikes | రాజాసాబ్‌కు షాకిచ్చిన హైకోర్టు – టికెట్ ధ‌ర‌ల పెంపు మెమో కొట్టివేత‌

రాజాసాబ్ మేక‌ర్స్‌కు దెబ్బ మీద దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు రాక న‌ష్ట‌పోయిన మేక‌ర్స్‌కు హైకోర్టు మ‌రో షాకిచ్చింది. తెలంగాణ‌లో టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుతూ హోంశాఖ కార్య‌ద‌ర్శి ఇచ్చిన మోమోను కొట్టేసింది.

N

Entertainment | Published On Jan 9, 2026, 6.26 pm IST

Ticket Rate Hikes | రాజాసాబ్‌కు షాకిచ్చిన హైకోర్టు – టికెట్ ధ‌ర‌ల పెంపు మెమో కొట్టివేత‌
Advertisement

Ticket Rate Hikes |రాజాసాబ్ నిర్మాత‌ల‌కు తెలంగాణ‌ హైకోర్టు గ‌ట్టి షాకిచ్చింది. సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుతూ హోంశాఖ ఇచ్చిన మెమోను శుక్ర‌వారం హైకోర్టు కొట్టేసింది. రాజాసాబ్ టికెట్ ధ‌ర‌ల పెంపును వ్య‌తిరేకిస్తూ విజ‌య్ గోపాల్ అనే లాయ‌ర్‌ హైకోర్టులో పిటీష‌న్ వేశారు. నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా రాజాసాబ్ టికెట్ ధ‌ర‌ల పెంచేందుకు అనుమ‌తులు ఇచ్చారంటూ త‌న పిటీష‌న్‌లో పేర్కొన్నారు. మోమో జారీ చేసే అధికారం హోం శాఖ కార్య‌ద‌ర్శికి లేద‌ని అన్నారు. హైద‌రాబాద్‌లో సీపీ, జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్ల‌కు మాత్ర‌మే టికెట్ రేట్ల పెంపుతో పాటు ప్రీమియ‌ర్ షోల‌కు అనుమ‌తులు ఇవ్వాల్సి వుంటుంద‌ని విజ‌య్ గోపాల్ వాదించారు. ఆయ‌న పిటీష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన కోర్టు టికెట్ ధ‌ర‌ల పెంచుతూ ఇచ్చిన మెమోను కొట్టేసింది. పాత ధ‌ర‌ల‌కే టికెట్ల‌ను అమ్మాల‌ని ఆదేశించింది.

హైకోర్టు ఆగ్ర‌హం...

ఈ సంద‌ర్భంగా అధికారుల‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను పెంచేది లేద‌ని సంబంధిత మంత్రి ఇచ్చిన ఆదేశాల‌ను ప‌ట్టించుకోరా...అయినా ప‌దే ప‌దే రేట్లు ఎంచుకు పెంచుతున్నారు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మార‌డం లేదు..తెలివిగా ఎందుకు మోమోలు జారీ చేస్తున్నార‌ని ప్ర‌శ్నించింది. మెమో ఇచ్చిన అధికారికి నిబంధ‌న‌లు తెలియ‌వా అంటూ మంద‌లిచింది.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప్రీమియ‌ర్స్‌కు అనుమ‌తులు ల‌భించ‌క‌పోవ‌డంతో న‌ష్ట‌పోయిన రాజాసాబ్ మేక‌ర్స్‌కు హైకోర్టు తీర్పుతో మ‌రో గ‌ట్టి దెబ్బ త‌గిలింది. టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తుల కోసం రాజాసాబ్‌ మేక‌ర్స్ హోంశాఖ కార్య‌ద‌ర్శితో పాటు హైకోర్టును ఆశ్ర‌యించారు. రేట్ల పెంపుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రీమియ‌ర్స్‌కు మాత్రం అనుమ‌తి ఇవ్వ‌కుండా కేవ‌లం టికెట్ రేట్లను పెంచుతూ గురువారం అర్ధ‌రాత్రి జీవోను జారీ చేశారు. జ‌న‌వ‌రి 9 నుంచి 11 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో 105, మ‌ల్టీప్లెక్స్‌లో 132 రూపాయ‌లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించారు. జ‌న‌వ‌రి 12 నుంచి 18 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో 62, మ‌ల్టీప్లెక్స్‌లో 89 పెంచుకోవ‌చ్చ‌ని జీవోలో పేర్కొన్నారు. ఈ లాభాల్లో ఇర‌వై శాతం ఫిలిం ఫెడ‌రేష‌న్‌కు ఇవ్వాల‌ని పేర్కొన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement