త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG High Court | బండి భ‌గీర‌థ్ బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా.. పోలీసుల‌కు హైకోర్టు కీల‌క ఆదేశాలు..!

TG High Court | పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర‌మంత్రి త‌న‌యుడు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారించింది. కేసులో కీలక అంశంగా మారిన బాధితురాలి వయస్సుపై స్పష్ట‌త ఇవ్వాల‌ని హైకోర్టు పోలీసుల‌ను ఆదేశించింది.

P

Telangana | Published On May 14, 2026, 4.24 pm IST

TG High Court | బండి భ‌గీర‌థ్ బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా.. పోలీసుల‌కు హైకోర్టు కీల‌క ఆదేశాలు..!
Advertisement

TG High Court | పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర‌మంత్రి త‌న‌యుడు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారించింది. కేసులో కీలక అంశంగా మారిన బాధితురాలి వయస్సుపై స్పష్ట‌త ఇవ్వాల‌ని హైకోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. ఈ మేర‌కు కేసు విచార‌ణ‌ను శుక్ర‌వారానికి వాయిదా వేసింది. విచార సంద‌ర్భంగా బాధితురాలి పుట్టిన తేది వివ‌రాల‌పై న్యాయ‌మూర్తి ప‌లు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. ఆమె మైనర్ కాదని, మేజర్ అని ఎలా నిరూపిస్తార‌ని పిటిష‌న‌ర్‌ను ప్ర‌శ్నించారు. ఐదేళ్ల కింద‌ట నమోదైన ఓ ట్రాఫిక్ కేసులో ఆ యువతి కారు న‌డిపిన స‌మ‌యంలో కేసు న‌మోదైంద‌ని, ఆ స‌మ‌యంలో 15 వేళ్ల వ‌య‌సు అని పేర్కొన్నార‌న్నారు.

అందులో ఉన్న డేట్ ఆఫ్ బ‌ర్త్ వివ‌రాలు స‌రైన‌వే అయితే తాను మేజ‌ర్ అవుతుంద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది నిరంజ‌న్‌రెడ్డి కోర్టులో వాదించారు. స‌ద‌రు యువ‌తి ప‌లు ర‌కాల తేదీల‌తో డేట్ ఆఫ్ బ‌ర్త్ స‌ర్టిఫికెట్స్ తీసుకుంద‌న్నారు. పోక్సో చ‌ట్టంలోని సెక్ష‌న్ 11 నిర్దేశించిన వాటి పరిధిలోకి పిటిష‌న‌ర్ రాడ‌ని, బీఎన్ఎస్ సెక్షన్ 74,75 ప్ర‌కారం ఆరోపించిన నేరాలు రుజువు కాలేద‌ని వాదించారు. బాధితురాలుగా పేర్కొంటున్న ఆమె వ‌య‌సు 19 నుంచి 20 మ‌ధ్య ఉంటుంద‌ని తెలిపింది. ఆమె తల్లి తప్పుడు రికార్డులు సృష్టించి, వ‌య‌సును త‌గ్గించి కఠినమైన ఫోక్సో చట్టం కింద న‌మోదు చేయించార‌న్నారు. ఎనిమిది నెల‌ల కింద‌ట జ‌రిగిన సంఘ‌ట‌న‌పై ఇప్పుడు ఫిర్యాదు చేయ‌డంలో దురుద్దేశాలు ఉన్నాయ‌ని ఆరోపించారు.

ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఫిర్యాదు చేసిన యువతి, ఆమె కుటుంబ సభ్యులు రూ.5 కోట్లు డిమాండ్ చేశారని కూడా కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. డబ్బు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ బెదిరింపులపై తాము కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాను ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రకు పాల్పడ్డారని బండి భగీరథ తరఫు న్యాయవాది కోర్టుకు వివ‌రించారు. వాద‌న‌లు విన్న కోర్టు.. బాధితురాలి పుట్టిన తేదీ వివ‌రాల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని పోలీసుల‌ను కోర్టు ఆదేశిస్తూ శుక్ర‌వారానికి వాయిదా వేసింది.

Advertisement
Advertisement