Prabhas Rajasaab | ప్రభాస్ రాజాసాబ్ అందుకే ఫెయిలయ్యింది – తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్
ప్రభాస్ రాజాసాబ్ ఫెయిల్యూర్పై టాలీవుడ్ సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాన్ ఇండియన్గా కాకుండా తెలుగు సినిమాగా వంద కోట్లతో రాజాసాబ్ను రూపొందించి ఉంటే లాభాలు వచ్చుండేవని అన్నారు.
Entertainment | Published On Jan 22, 2026, 4.08 pm IST
Prabhas Rajasaab |ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ భారీ డిజాస్టర్ దిశగా సాగుతోంది. హారర్ కామెడీగా రూపొందిన ఈ మూవీ ఇటీవల సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రిలీజ్కు ముందు సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్ కోసమే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడం, ప్రమోషన్స్లో మారుతితో పాటు హీరోయిన్లు చేసిన కామెంట్లతో రాజాసాబ్పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కంటెంట్ వీక్ కావడం, కథలో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండటంతో పాటు లెంగ్తీ రన్టైమ్ కారణంగా రాజాసాబ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాదాపు 450 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ ఇప్పటివరకు 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు ఈ సినిమా 200 కోట్లకుపైనే నష్టాలను మిగిల్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది.రాజాసాబ్ ఫెయిల్యూర్పై టాలీవుడ్ సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తెలుగు సినిమాగా...
పాన్ ఇండియన్ సినిమాగా కాకుండా కేవలం తెలుగులోనే రీజనల్ మూవీగా వంద కోట్ల బడ్జెట్తో తీసుంటే సినిమా పెద్ద హిట్టయ్యి ఉండేదని అన్నారు."తొలుత తక్కువ బడ్జెట్లో కేవలం తెలుగు ఆడియెన్స్ కోసమే రాజాసాబ్ తీయాలనుకున్నారు. ఆ తర్వాత పాన్ ఇండియన్ సినిమాగా చేయాలని స్క్రిప్ట్లో చాలా మార్పులు చేసుకుంటూ వచ్చారు. దాంతో మొదట అనుకున్న కథ పూర్తిగా మారిపోయింది. కేవలం వంద కోట్ల బడ్జెట్తో తెలుగు సినిమాగా తీసుకుంటే రాజాసాబ్ పెద్ద హిట్టయ్యి ఉండేది నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చుండేవి" అని ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
పాన్ ఇండియన్ పేర్లతో అవసరానికి మించి బడ్జెట్లు పెడితే ఇలాంటి రిజల్టే ఉంటుందని నెటిజన్లు చెబుతోన్నారు. హీరోల రెమ్యూనరేషన్ల కోసమే వంద కోట్లకుపైగా ఖర్చు చేయడం కూడా పాన్ ఇండియన్ సినిమాల నష్టానికి కారణమని మరికొందరు పేర్కొంటున్నారు.
సీక్వెల్ డౌటే...
రాజాసాబ్ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. రాజాసాబ్కు సీక్వెల్ను తెరకెక్కించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాజాసాబ్ సర్కస్ 1935 పేరుతో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. రాజాసాబ్ ఫెయిల్యూర్తో ఈ సీక్వెల్ రూపొందడం ఆనుమానంగా మారింది.
సంబంధిత వార్తలు

Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ – సెట్స్లోకి అడుగుపెట్టబోతున్న హాట్ బ్యూటీ
మే 21, 2026

Rakul Preet Singh | ప్రభాస్ సినిమా నుంచి నన్ను తీసేశారు – రకుల్ కామెంట్స్…
మే 8, 2026

Sai Pallavi | సాయిపల్లవి కారణంగా ప్రభాస్ కల్కి 2 షూటింగ్ క్యాన్సిల్ – అసలేమైందంటే?
మే 5, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



