త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood | వెబ్ సిరీస్ డైరెక్ట‌ర్‌తో ధురంధ‌ర్ హీరో మూవీ – మ‌ల‌యాళ బ్యూటీతో రొమాన్స్‌

ధురంధ‌ర్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్‌తో సినిమా చేసేందుకు ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కులు సిద్ధ‌మ‌య్యారు. కానీ ర‌ణ్‌వీర్‌సింగ్ మాత్రం ఓ వెబ్‌సిరీస్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. స్కామ్ 1992 ఫేమ్ జై మెహ‌తాతో జాంబీ థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌బోతున్నాడు. ఆదివారం ముంబైలో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది.

N

Entertainment | Published On Aug 16, 2026, 4.01 pm IST

Bollywood | వెబ్ సిరీస్ డైరెక్ట‌ర్‌తో ధురంధ‌ర్ హీరో మూవీ – మ‌ల‌యాళ బ్యూటీతో రొమాన్స్‌
Advertisement

Bollywood | ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించిన ధురంధ‌ర్‌, ధురంధ‌ర్ 2 సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాశాయి. ధురంధ‌ర్ 2 మూవీ బాలీవుడ్ హిస్ట‌రీలోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న సెకండ్ మూవీగా నిలిచింది. ఈ రెండు సినిమాల్లో హ‌మ్జా అలీ పాత్ర‌లో ర‌ణ్‌వీర్ త‌న న‌ట‌న‌తో బాలీవుడ్ ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్‌ను మెప్పించాడు.

స్కామ్ 1992 ఫేమ్‌...

ధురంధ‌ర్ రెండు పార్ట్‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిల‌వ‌డంతో ర‌ణ్‌వీర్‌సింగ్ కోసం ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కులు క‌థ‌లు సిద్ధం చేశారు. కానీ ర‌ణ్‌వీర్ సింగ్ మాత్రం వారిని కాద‌ని వెబ్‌సిరీస్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. స్కామ్ 1992, లూటేరే వెబ్‌సిరీస్‌ల‌తో ఫేమ‌స్ అయిన జై మెహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్‌వీర్‌సింగ్ ప్ర‌ళ‌య్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. జాంబీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను అన‌న్యా బిర్లాతో క‌లిసి ర‌ణ్‌వీర్‌సింగ్ స్వ‌యంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌ళ‌య్‌తోనే ఈ బాలీవుడ్ హీరో ప్రొడ్యూస‌ర్‌గా మార‌బోతున్నారు. ఇందులో అన‌న్యా బిర్లా కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.

మ‌ల‌యాళ బ్యూటీ...

ప్ర‌ళ‌య్ మూవీతో మ‌ల‌యాళ హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఆదివారం సెలైంట్‌గా ఈ మూవీ షూటింగ్‌ను మేక‌ర్స్ మొద‌లుపెట్టారు. తొలిరోజే ర‌ణ్‌వీర్‌సింగ్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌తో పాటు అన‌న్యా బిర్లా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన‌ట్లు స‌మాచారం.

ముంబైలో జాంబీలు...

జాంబీ బ్యాక్‌డ్రాప్‌లో స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ప్ర‌మాద‌క‌ర వైర‌స్ కార‌ణంగా ముంబైలోని ప్ర‌జ‌లంతా జాంబీలుగా మారుతారు. ఓ వివాహిత‌, ప్రేమ జంట‌తో పాటు మ‌రో యువ‌కుడు జాంబీ వైర‌స్ బారి నుంచి త‌మ ప్రాణాల‌ను కాపాడుకోవ‌డానికి ఏం చేశారు? జాంబీ వైర‌స్ నుంచి ముంబై న‌గ‌రాన్ని ఎలా కాపాడ‌ర‌నే పాయింట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో ప్ర‌ళ‌య్ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ జువాన్ కార్లోస్ గిల్ ఈ సినిమాకు కెమెరామెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్‌ను ఆస్ట్రేలియాలో తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. ర‌ణ్‌వీర్‌సింగ్ భార్య దీపికా ప‌డుకోన్ ప్రెగ్నెంట్ కావ‌డంతో ముంబైలోనే షూటింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

 

Advertisement
Advertisement