త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | ద‌ళ‌ప‌తి విజ‌య్‌ జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల వాయిదా..

త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay) న‌టించిన భారీ చిత్రం జ‌న నాయ‌గ‌న్ (Jana Nayagan) విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ మేర‌కు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ (KVN Productions) ప్ర‌క‌టిచింది.

G

Entertainment | Published On Jan 8, 2026, 6.46 am IST

Jana Nayagan | ద‌ళ‌ప‌తి విజ‌య్‌ జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల వాయిదా..
Advertisement

trinethra.news | త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay) న‌టించిన భారీ చిత్రం జ‌న నాయ‌గ‌న్ (Jana Nayagan) విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ మేర‌కు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ (KVN Productions) బుధ‌వారం రాత్రి సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ప్ర‌క‌టిచింది. విజ‌య్ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన నేప‌థ్యంలో జ‌న నాయ‌గ‌న్ ఆయ‌న చివ‌రి చిత్రంగా ప్ర‌చారం జ‌రిగింది. హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డ్ నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అంద‌క‌పోవ‌డంతో చిత్ర‌బృందం కోర్డును ఆశ్ర‌యించింది. జ‌న‌వ‌రి 9న న్యాయ‌స్థానం నుంచి తుది ఉత్త‌ర్వులు రానుండ‌టంతో సినిమా విడుద‌ల‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది. త‌దుప‌రి తేదీని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది.

మా నియంత్ర‌ణ‌కు మించిన అనివార్య ప‌రిస్థితుల కార‌ణంగా జ‌న నాయ‌గ‌న్ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. కొత్త విడుద‌ల తేదీని వీలైనంత త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాం. అప్ప‌టివ‌ర‌కు అంతా ఓపిక‌తో ఉండండి. మీ అంద‌రి మ‌ద్ద‌తు మా జ‌న నాయ‌గ‌న్ బృందానికి గొప్ప బ‌లం. అంటూ నిర్మాణ సంస్థ టీవీకే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఉద్దేశ‌పూర్వ‌క‌ జాప్యం..!

కాగా, సెన్సార్ బోర్డు నుంచి స‌ర్టిఫికెట్ జారీలో జ‌రుగుతున్న జాప్యంపై తమిళగ వెట్రి కజగం (TVK) డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. డిసెంబర్ 19న సినిమాను సెన్సార్ కమిటీకి చూపించాం. అయిన‌ప్పటికీ ఇంకా ధ్రువీక‌ర‌ణ ప‌త్రం జారీ చేయలేదని మండిప‌డ్డారు. ఇది కేవ‌లం సాంకేతిక కార‌ణంగా ఆల‌స్యం జ‌రుగ‌డం లేద‌ని, ఉద్దేశ‌పూర్వ‌కంగానే జాప్యం చేస్తున్నార‌న్నారు. దీన్ని రాజ‌కీయం చేయాల‌ని త‌మ పార్టీ కోరుకోలేద‌ని, ఇలాగే కొన‌సాగితే చ‌ట్ట‌ప‌రమైన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఈ మూవీని తెలుగులో జ‌న నాయ‌కుడు పేరుతో విడుద‌ల చేస్తుండ‌గా.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడులోనూ ఇంకా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ మొద‌లుకాలేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement