త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | 5 కోట్ల బ‌డ్జెట్ – యాభై కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఎకో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తోంది. డిసెంబ‌ర్ 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సందీప్ ప్ర‌దీప్‌, సౌర‌భ్ స‌చ్‌దేవ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీకి దింజిత్ అయ్య‌థాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

N

Entertainment | Published On Dec 26, 2025, 5.30 pm IST

OTT | 5  కోట్ల బ‌డ్జెట్ – యాభై కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

ఎకో మూవీ

Advertisement

OTT | మ‌ల‌యాళంలో ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించింది ఎకో. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎకో మూవీలో పేరున్న స్టార్లు ఎవ‌రూ లేరు. బ‌డ్జెట్ త‌క్కువే. చాలా వ‌ర‌కు సింగిల్ లోకేష‌న్‌లోనే సాగుతుంది. అయినా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించింది. ఈ ఏడాది వ‌చ్చిన బెస్ట్ మ‌ల‌యాళ థ్రిల్ల‌ర్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది.

నెట్‌ఫ్లిక్స్‌లో...

తాజాగా ఈ మ‌ల‌యాళ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఎకో డిసెంబ‌ర్ 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మ‌ల‌యాళం, తెలుగుతో పాటు మ‌రో మూడు భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. ఎకో సినిమాలో సందీప్ ప్ర‌దీప్, వినీత్‌, సౌర‌భ్ స‌చ్‌దేవ్, న‌రేన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌లేషియ‌న్ యాక్ట‌ర్స్ బియానా మోమిన్‌, సిమ్‌జీ కూడా క‌నిపించారు. దింజిత్ అయ్య‌థాన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా బాహుల్ ర‌మేష్ క‌థ‌ను అందించారు.

హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్‌...

ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఎకో మూవీ థియేట‌ర్ల‌లో యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. కిష్కింద‌కాండం సినిమాతో పాటు కేర‌ళ క్రైమ్ ఫైల్స్ 2 వెబ్‌సిరీస్ త‌ర్వాత యానిమ‌ల్ ట్ర‌యాల‌జీలో భాగంగా దింజిత్ అయ్య‌థాన్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఫ‌స్ట్ వీక్‌లో చాలా త‌క్కువ థియేట‌ర్ల‌లో ఎకో మూవీ రిలీజైంది. మౌత్ టాక్ బాగుండ‌టంతో థియేట‌ర్లు మెళ్ల‌మెళ్ల‌గా పెరిగాయి.

ఎకో క‌థ ఇదే...

కురియ‌చ‌న్ ఓ క్రిమిన‌ల్‌. అత‌డి కోసం చాలా ఏళ్లుగా పోలీసుల‌తో పాటు కొంత‌మంది రౌడీలు వెతుకుతుంటారు. కేర‌ళ క‌ర్ణాట‌క బార్డ‌ర్‌లోని ఓ కొండ ప్రాంతంలో కురియ‌చ‌న్ భార్య మాల‌తి ఒంట‌రిగా ఉంటుంది. కురియ‌చ‌న్‌ను వెతుక్కుంటూ ఆ కొండ ప్రాంతానికి వ‌చ్చిన వారంద‌రిని ఆ ప్రాంతంలోని అడివి కుక్క‌లు చంపేస్తుంటాయి. మాల‌తికి కేర్ టేక‌ర్‌గా ప‌నిచేసే పీయోస్ ఎవ‌రు? అస‌లు కురియ‌చ‌న్ ఎలా మిస్స‌య్యాడు? ఈ మిస్ట‌రీ ఎలా సాల్వ్ అయ్యింది అనే అంశాల‌తో ఎకో మూవీ రూపొందింది.

Advertisement

తాజావార్తలు

Advertisement