త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే మ‌ల‌యాళం హార‌ర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌

లేటెస్ట్ మ‌ల‌యాళం హార‌ర్ కామెడీ మూవీ క‌రుక్క‌మ్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ వ‌చ్చేసింది. శ్రీనాథ్ బాషీ, ఫెమినా జార్జ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ జూలై సెకండ్ వీక్ నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jun 29, 2026, 7.13 pm IST

Malayalam OTT | ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే మ‌ల‌యాళం హార‌ర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌
Advertisement

Malayalam OTT |  లేటెస్ట్ మ‌ల‌యాళం హార‌ర్ కామెడీ మూవీ క‌రుక్క‌మ్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. శ్రీనాథ్ బాషీ, ఫేమినా జార్జ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు సుభాష్ ల‌లిత సుబ్ర‌మ‌ణియ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పుష్ప ఫేమ్ సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు. మే నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మ‌ల‌యాళం మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌ను ద‌క్కించుకుంది. నాలుగు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో ఎనిమిది కోట్లకుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది.

సోనీలివ్‌...

తాజాగా ఈ మ‌ల‌యాళం హార‌ర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీలివ్ ద‌క్కించుకుంది. జూలైలో క‌రుక్క‌మ్ ఓటీటీలోకి రానున్న‌ట్లు సోనీలివ్‌ ప్లాట్‌ఫామ్ ప్ర‌క‌టించింది. జూలై 10న ఈ హార‌ర్ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆత్మ‌ల బారిన ప‌డితే...

ఆత్మ‌ల బారిన ప‌డిన ఇద్ద‌రు స్నేహితుల క‌థ‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. కాన్సెప్ట్‌, కామెడీ తో పాటు ట్విస్ట్‌లు బాగున్నాయ‌నే టాక్ వ‌చ్చింది. ధ‌నుష్, ఖాజా ప్రాణ స్నేహితులు. ఓ రోజు తాగిన మ‌త్తులో శ్మ‌శానంలోకి వ‌స్తారు. స‌మాధుల‌పై ఉన్న శిలువ‌ల‌ను తొల‌గిస్తారు. అప్ప‌టినుంచి ఐదు ఆత్మ‌లు వారిని వెంటాడ‌టం మొద‌లుపెడ‌తాయి. ఆ ఆత్మ‌ల కార‌ణంగా ఇద్ద‌రూ స్నేహితులు ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు? వాటి గ‌తం ఏమిటి? ఆత్మ‌ల నుంచి ఇద్ద‌రికి విముక్తి ల‌భించిందా? లేదా? అన్న‌దే క‌రుక్క‌మ్ మూవీ క‌థ‌. ఈ సినిమాలో ప్ర‌వీణ్ టీజే, అభిరామ్ రాధాకృష్ణ‌న్‌, జీన్ లాల్ పాల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

మిన్న‌ల్ ముర‌ళితో...

మంజుమ్మ‌ల్ బాయ్స్‌తో మ‌ల‌యాళంలో ఫేమ‌స్ అయ్యాడు శ్రీనాథ్ భాషీ. ఈ సినిమాలో సుభాష్ అనే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. మ‌రోవైపు మిన్న‌ల్ ముర‌ళి మూవీతో మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఫెమినా జార్జ్. మ‌ల‌యాళంలో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఏగ‌న్ మూవీతో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం కాబోతుంది. ఇటీవ‌లే ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ఏగ‌న్ మూవీలో ఫెమినా జార్జ్‌తో పాటు కోర్ట్ ఫేమ్ శ్రీదేవి మ‌రో నాయిక‌గా క‌నిపించ‌బోతుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement