త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MSVP Day 1 Collections | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – బాక్సాఫీస్ వ‌ద్ద మెగాస్టార్ ఊచ‌కోత

చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీ ఫ‌స్ట్ డే రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సోమ‌వారం రోజు ఈ సినిమాకు 84 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఫ‌న్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

N

Entertainment | Published On Jan 13, 2026, 2.34 pm IST

MSVP  Day 1 Collections | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – బాక్సాఫీస్ వ‌ద్ద మెగాస్టార్ ఊచ‌కోత
Advertisement

MSVP Day 1 Collections | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌స్ట్ డే కుమ్మేసింది. చిరంజీవి కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సంక్రాంతి కానుక‌గా సోమ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలిరోజు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 84 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.

నైజాంలో హ‌య్యెస్ట్‌...

నైజాంలో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రీమియ‌ర్స్‌తో క‌లిపి ఇర‌వై కోట్ల‌కుపైగా గ్రాస్‌...9.3 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకుంది. సైరా, ఆచార్య సినిమాల రికార్డుల‌ను బ్రేక్ చేసింది.
మొద‌టి రోజే ఈ సినిమా 42 శాతం వ‌ర‌కు రిక‌వ‌రీ సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. మొద‌టి రోజు ఓపెనింగ్స్ జోరు చూస్తుంటే ఈ వీకెండ్ లోగా ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్ట‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ రాజాసాబ్‌తో పాటు మంగ‌ళ‌వారం రిలీజైన ర‌వితేజ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమాల‌కు నెగెటివ్ టాక్ రావ‌డంతో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుకు క‌లిసివ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతి రిలీజ్‌ల‌లో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

చిరంజీవి కామెడీ టైమింగ్‌...

ఫ‌న్ ఫ్యామిలీ డ్రామా ఎలిమెంట్స్‌తో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారును రూపొందించారు. త‌న‌కు దూర‌మైన భార్య పిల్ల‌ల‌కు తిరిగి భ‌ర్త ఎలా ద‌గ్గ‌ర‌య్యాడ‌నే కాన్సెప్ట్‌కు త‌న‌దైన మార్కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ను జోడించి ఈ సినిమాను తెర‌కెక్కించారు అనిల్ రావిపూడి. చిరంజీవి కామెడీ టైమింగ్‌, స్వాగ్‌తో పాటు వెంక‌టేష్ గెస్ట్ రోల్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు ట్వీట్స్, కామెంట్స్ పెడుతున్నారు.
మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారులో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. కేథ‌రీన్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, శ‌ర‌ద్ ఖేల్క‌ర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. భీమ్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. సాహు గార‌పాటితో క‌లిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు నిర్మించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement