త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Money Laundering Case | అప్రూవ‌ర్‌గా మారేందుకు సిద్ధం.. కోర్టులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Money Laundering Case | ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.200కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. అవసరమైతే అప్రూవర్‌గా మారేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కోర్టుకు వెల్లడించింది.

P

Entertainment | Published On Apr 17, 2026, 5.12 pm IST

Money Laundering Case | అప్రూవ‌ర్‌గా మారేందుకు సిద్ధం.. కోర్టులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్
Advertisement

Money Laundering Case | ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.200కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. అవసరమైతే అప్రూవర్‌గా మారేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కోర్టుకు వెల్లడించింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఆమె అప్రూవర్‌గా మారాలంటే నేరుగా ఈడీకి అధికారికంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఆమె ఇచ్చే ప్రకటనలు, దర్యాప్తుకు అందించే సహకారం ఆధారంగా అప్రూవర్ హోదా ఇవ్వాలా వ‌ద్దా అనేది ఈడీ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని పేర్కొంది. ఈ అంశంపై ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు.. కేసు విచార‌ణ‌ను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ సంద‌ర్భంగా జాక్వెలిన్‌కు విదేశీ పర్యటనకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 24 నుంచి మే 25 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఉన్నప్పటికీ.. కోర్టు విధించిన కొన్ని షరతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసు మొత్తం రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌కు కేసు సంబంధించింది. ఇందులో ఆర్థిక నేర‌గాడు సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నాడు. జైలులో ఉన్న‌ప్ప‌టికీ భారీ మోసాలు, వ‌సూళ్ల కోసం నెట్‌వ‌ర్క్‌ని న‌డిపిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. అనేక మంది నుంచి కోట్లాది రూపాయ‌ల సొత్తును దోచుకున్న‌ట్లుగా ద‌ర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో బాలీవుడ్‌తో సంబంధాలు ఉన్న‌ట్లుగా తేలింది. ఈ క్ర‌మంలోనే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈడీ దర్యాప్తు ప్రకారం.. సుకేష్ జాక్వెలిన్‌కు ఖ‌రీదైన గడియారాలు, బ్యాగులు, నగలు తదితర విలువైన బహుమతులు ఇచ్చినట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఇవ‌న్నీ అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసినవేనని ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆరోపిస్తున్న‌ది. అయితే, జాక్వెలిన్ మాత్రం సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్ అస‌లు వ్య‌క్తిత్వం, అత‌ని నేరాల గురించి తెలియ‌న‌ది స్ప‌ష్టం చేసింది. త‌న‌ను ఓ వ్యాపార‌వేత్త‌గా ప‌రిచ‌యం చేసుకొని త‌న‌ను మోసం చేశాడ‌ని కోర్టుకు తెలిపింది.

Advertisement
Advertisement