Money Laundering Case | అప్రూవర్గా మారేందుకు సిద్ధం.. కోర్టులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్
Money Laundering Case | ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. అవసరమైతే అప్రూవర్గా మారేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కోర్టుకు వెల్లడించింది.
Entertainment | Published On Apr 17, 2026, 5.12 pm IST
Money Laundering Case | ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. అవసరమైతే అప్రూవర్గా మారేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కోర్టుకు వెల్లడించింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఆమె అప్రూవర్గా మారాలంటే నేరుగా ఈడీకి అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని ఉంటుందని స్పష్టం చేసింది. ఆమె ఇచ్చే ప్రకటనలు, దర్యాప్తుకు అందించే సహకారం ఆధారంగా అప్రూవర్ హోదా ఇవ్వాలా వద్దా అనేది ఈడీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఈ అంశంపై ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు.. కేసు విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా జాక్వెలిన్కు విదేశీ పర్యటనకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 24 నుంచి మే 25 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఉన్నప్పటికీ.. కోర్టు విధించిన కొన్ని షరతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసు మొత్తం రూ.200 కోట్ల మనీ లాండరింగ్కు కేసు సంబంధించింది. ఇందులో ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జైలులో ఉన్నప్పటికీ భారీ మోసాలు, వసూళ్ల కోసం నెట్వర్క్ని నడిపినట్లుగా ఆరోపణలున్నాయి. అనేక మంది నుంచి కోట్లాది రూపాయల సొత్తును దోచుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో బాలీవుడ్తో సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఈ క్రమంలోనే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈడీ దర్యాప్తు ప్రకారం.. సుకేష్ జాక్వెలిన్కు ఖరీదైన గడియారాలు, బ్యాగులు, నగలు తదితర విలువైన బహుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇవన్నీ అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసినవేనని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నది. అయితే, జాక్వెలిన్ మాత్రం సుకేశ్ చంద్రశేఖర్ అసలు వ్యక్తిత్వం, అతని నేరాల గురించి తెలియనది స్పష్టం చేసింది. తనను ఓ వ్యాపారవేత్తగా పరిచయం చేసుకొని తనను మోసం చేశాడని కోర్టుకు తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



