Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
Tummala Nageshwar Rao | ప్రజా ప్రభుత్వంలో రైతులకు, వ్యవసాయ రంగానికి అండగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు.
Tummala Nageshwar Rao | త్రినేత్ర.న్యూస్ : ప్రజా ప్రభుత్వంలో రైతులకు, వ్యవసాయ రంగానికి అండగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం కింద గత 30 మాసాల పరిపాలనలో.. ఈ కాలంలోనే 36 వేల కోట్లు కేవలం రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం.. భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో మంత్రి తుమ్మల పాల్గొని ప్రసంగించారు.
గత పదేండ్ల తెలంగాణ ప్రభుత్వ కాలంలో 72 వేల కోట్లు వేస్తే కేవలం ప్రజా పాలనలో 30 మాసాల్లోనే 36 వేల కోట్లు జమ చేశాం. వ్యవసాయ రంగానికి సహకరిస్తున్నాం. ఆర్థికంగా విధ్వంసమైన రాష్ట్రాన్ని మా చేతిలో పెడితే గుండె ధైర్యంతో కష్టాలు ఉన్న ఇబ్బందులు, సమస్యలు ఉన్నా సాగుకు సహకరించాలని మొండి పట్టుదలతో ముందుకు పోతున్న ఏకైక ప్రభుత్వం మాది. గత రెండున్నరేండ్లలో అత్యధిక దిగుబడి సాధించాం. ఈ ఏడాది రెండు పంటలకు కలిపి 2 కోట్ల 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి అగ్రగామిగా నిలిచాం. ఎంఎస్పీ ధరలు ప్రకంటించినప్పటికీ కేంద్రం సహకరించట్లేదు.. అన్ని పంటలను కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం మాది. 3,720 కోట్ల మొక్కజొన్న రైతుల ఖాతాల్లో ఇవాళ జమ చేస్తున్నాం. జొన్నలు, సోయా, సన్ ఫ్లవర్ ఎంఎస్సీకి కొనుగోలు చేశాం. కేంద్రం చేతులెత్తేసింది. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అన్ని పంటలు కొనుగోలు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు.
నెల పదిహేను రోజుల్లో సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు
ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి లక్షలాది మంది రైతులు తరలివచ్చారు. నెల పదిహేను రోజుల్లో సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు పారిస్తాం. కృష్ణా నదిలో ఉన్న ఇబ్బందులు భవిష్యత్లో ఇంకా తీవ్రమవుతాయి. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. పాలేరు నింపుతాం. ఈ జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరిస్తున్నాం. జిల్లా ప్రజల ఆశలకు అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఖమ్మం జిల్లా రేవంత్ సర్కార్కు అండగా ఉండాలని ఆశీర్వదించాలని కోరుతున్నాను అని తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026

CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026

CM Revanth Reddy | కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026
తాజావార్తలు
- ●Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ - మాస్ పోస్టర్తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
- ●CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●PM Modi | 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్కు భారత ప్రధాని.. మోదీకి ఘన స్వాగతం
- ●CM Revanth Reddy | కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Sheikh Hasina | డిసెంబర్లో స్వదేశానికి.. లొంగిపోయేందుకు సిద్ధం : షేక్ హసీనా కీలక ప్రకటన
- ●ECI SIR | ‘సర్’ డిజిటలైజేషన్ వేగవంతం చేయండి

Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ - మాస్ పోస్టర్తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!

CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

PM Modi | 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్కు భారత ప్రధాని.. మోదీకి ఘన స్వాగతం

CM Revanth Reddy | కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి



