త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Actor Vijay | క‌రూర్ తొక్కిస‌లాట కేసు.. రేపు సీబీఐ విచార‌ణ‌కు విజ‌య్‌..!

Actor Vijay | ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, టీవీకే అధినేత విజ‌య్ సోమ‌వారం సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలోని సీబీఐ కేంద్ర కార్యాల‌యంలో అధికారుల ఎదుట హాజ‌రుకానున్నారు. గ‌తేడాది క‌రూర్‌లో తొక్కిస‌లాటలో 41 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని విజ‌య్‌కి సీబీఐ స‌మ‌న్లు జారీ చేసింది.

P

Entertainment | Published On Jan 11, 2026, 6.09 pm IST

Actor Vijay | క‌రూర్ తొక్కిస‌లాట కేసు.. రేపు సీబీఐ విచార‌ణ‌కు విజ‌య్‌..!
Advertisement
  • అరెస్ట్ చేస్తారంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం

Actor Vijay | ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, టీవీకే అధినేత విజ‌య్ సోమ‌వారం సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలోని సీబీఐ కేంద్ర కార్యాల‌యంలో అధికారుల ఎదుట హాజ‌రుకానున్నారు. గ‌తేడాది క‌రూర్‌లో తొక్కిస‌లాటలో 41 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని విజ‌య్‌కి సీబీఐ స‌మ‌న్లు జారీ చేసింది.

గ‌త సెప్టెంబ‌ర్ 27న త‌మిళ‌నాడులోని క‌రూర్ జిల్లాలో త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం పార్టీ ర్యాలీ నిర్వ‌హించింది. భారీ సంఖ్య‌లో జ‌నం త‌ర‌లిరాగా.. ఒక్క‌సారిగా తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది పిల్ల‌లు, 18 మంది మ‌హిళ‌లు స‌హాల 41 మంది మ‌ర‌ణించారు. వంద మందికిపైగా గాయ‌ప‌డ్డారు. ఎక్కువ సంఖ్య‌లో జ‌నం ముందుకు దూసుకురావ‌డంతో వేలుసామిపురం వ‌ద్ద క‌రూర్‌-ఈరోడ్ జాతీయ ర‌హ‌దారిపై తొక్కిస‌లాట జ‌రిగింది. ర్యాలీకి షెడ్యూల్ కంటే ఏడు గంట‌ల ఆల‌స్యంగా రావ‌డం, వేలాది మంది అభిమానులు చూసేందుకు త‌ర‌లివ‌చ్చారు. తీవ్ర‌మైన వేడి కార‌ణంగా డీహైడ్రేష‌న్‌కు గుర‌వ‌డంతో పరిస్థితి మరింత దిగజారింది.

గ‌తేడాది అక్టోబ‌ర్‌లో సుప్రీంకోర్టు ఈ ఘ‌ట‌న‌పై సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని సైతం సుప్రీం నియ‌మించింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 12న విచార‌ణ‌కు రావాల‌ని విజ‌య్‌కి సీబీఐ స‌మ‌న్లు జారీ చేసింది. అయితే, త‌మిళ‌నాడు పోలీసులు త‌మ హెచ్చ‌రిక‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని ఆరోపిస్తూ టీవీకే నేత‌ల‌పై అభియోగాల‌ను న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ కోసం ఏక స‌భ్యుడితో కూడిన న్యాయ క‌మిష‌న్‌ను సైతం ఏర్పాటు చేశారు.

ఇటీవ‌ల కేసు ద‌ర్యాప్తులో భాగంగా ప్ర‌చారం కోసం ఉప‌యోగించిన బ‌స్సును సీబీఐ అధికారులు సీజ్ చేశారు. కరూర్ సభ రోజున వాహ‌నం ప్ర‌యాణ వివ‌రాలు, అనుమ‌తి త‌దిత‌ర అంశాల‌ను నిర్ధారించుకునేందుకు బ‌స్‌ను స్వాధీనం చేసుకొని ప‌రిశీలిస్తున్నారు. అలాగే, బ‌స్ డ్రైవ‌ర్‌ను ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో విజ‌య్ సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రుకానుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, విజ‌య్‌ని సీబీఐ అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. విజ‌య్‌ను రాజ‌కీయంగా దెబ్బ‌తీయాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement