త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maha Shivratri | వేముల‌వాడ‌కు పోటెత్తిన భ‌క్తులు.. వైభ‌వంగా శివ‌రాత్రి వేడుక‌లు

Maha Shivratri | రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేముల‌వాడ‌లో మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా రాజ‌రాజేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఆల‌య అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వ‌రాల‌యంలో భ‌క్తులు ద‌ర్శ‌నాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసిన విష‌యం తెలిసిందే.

P

Devotional | Published On Feb 15, 2026, 4.09 pm IST

Maha Shivratri | వేముల‌వాడ‌కు పోటెత్తిన భ‌క్తులు.. వైభ‌వంగా శివ‌రాత్రి వేడుక‌లు
Advertisement

Maha Shivratri | రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేముల‌వాడ‌లో మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా రాజ‌రాజేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఆల‌య అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వ‌రాల‌యంలో భ‌క్తులు ద‌ర్శ‌నాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసిన విష‌యం తెలిసిందే. శివ‌రాత్రి సంద‌ర్భంగా ఆల‌యానికి భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. శివ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అలాగే, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం త‌ర‌ఫున అధికారులు రాజ‌న్న‌కు ప‌ట్టువ‌స్త్రాల‌ను ఆల‌య అధికారుల‌కు అంద‌జేశారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా అధికారులు భ‌క్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలు, పూల‌తో అందంగా అలంక‌రించారు. రాజ‌న్న ఆల‌య విస్త‌ర‌ణ సంద‌ర్భంగా స్వామివారిని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప‌లువురు భ‌క్తులు ప్ర‌ధాన ఆల‌యం వ‌ద్ద ఎల్ఈడీ స్క్రీన్‌పై స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ఇన్‌చార్జి క‌లెక్ట‌ర్ గ‌రీమా అగ్ర‌వాల్ ప‌రిశీలించారు. ప‌లువురు భ‌క్తుల‌తో మాట్లాడి ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఆల‌య అభివృద్ధి కోసం పోరాటం : పొన్నం

ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. వేములవాడ ప్రాముఖ్యత కలిగిన దేవాల‌య‌మ‌న్నారు. ఆనాడు వేముల‌వాడ ఆల‌య అభివృద్ధి కోసం పోరాటం చేశార‌న్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో ఆల‌యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామ‌న్నారు. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో రాష్ట్రమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నాన‌న్నారు. ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయం, సమ్మక్క సారలమ్మ ఆలయం పేదల దేవుడు ప్రజల విశ్వాసంతో అభివృద్ధి చేస్తుంద‌న్నారు. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని స్వామివారిని కురుకున్న‌ట్లు చెప్పారు. ఆది శ్రీ‌నివాస్ మాట్లాడుతూ.. వేములవాడ పరమ శివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని వేడుకున్నాన‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ లో ఉత్సవాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. దక్షిణ కాశిగా పేరుగాంచిన ఆల‌యాన్ని.. రూ.150 కోట్లతో నాలుగు ఎక‌రాల్లో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. ఎప్పటికప్పుడు సీఎం, మంత్రులు ఆలయ అభివృద్ధిని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement