త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

యూట్యూబ్‌లో వీడియో చూసి ఆప‌రేష‌న్ చేసి మ‌హిళ‌ను చంపేశాడు

దీంతో ఆ మ‌హిళ భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు వీళ్లు నిజ‌మైన డాక్ట‌ర్లు కాద‌ని, న‌కిలీ డాక్ట‌ర్ల‌ని పోలీసుల నిర్ధారించారు. గ‌త కొన్నేళ్లుగా అన‌ధికారికంగా క్లీనిక్‌ను న‌డుపుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

J

Crime | Published On Dec 10, 2025, 4.14 pm IST

యూట్యూబ్‌లో వీడియో చూసి ఆప‌రేష‌న్ చేసి మ‌హిళ‌ను చంపేశాడు
Advertisement

యూట్యూబ్ వ‌చ్చాక అన్ని విష‌యాలు ఈజీగా తెలుస్తున్నాయి. యూట్యూబ్‌లో దొర‌క‌ని స‌మాచారం ఉండ‌దు. కానీ, దాన్ని మంచి కోసం వాడుకోవాలి కానీ చెడుగా వాడితే, తొంద‌ర‌ప‌డితే ఇలాగే అవుతుంది. యూట్యూబ్‌లో ట్యుటోరియ‌ల్స్ చూసి ఓ న‌కిలీ డాక్ట‌ర్ ఓ మ‌హిళ‌కు ఆప‌రేష‌న్ చేశాడు. ఆ ఆప‌రేష‌న్ ఫెయిల్ కావ‌డంతో ఆ మ‌హిళ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బరాబంకిలో చోటు చేసుకుంది.

ప్ర‌కాశ్ మిశ్రా అనే వ్య‌క్తికి స‌రైన ఆథ‌రైజేష‌న్ లేకున్నా శ్రీ దామోద‌ర్ ఔష‌ధాల‌య అనే ఆసుప‌త్రిని ఏర్పాటు చేశాడు. అత‌డితో పాటు త‌న బంధువు కూడా అదే ఆసుప‌త్రిలో ప‌ని చేస్తుంటాడు. డిసెంబ‌ర్ 5న మునిశ్రా రావ‌త్ అనే మ‌హిళ ఈ ఆసుప‌త్రికి వ‌చ్చింది. త‌న‌కు క‌డుపులో నొప్పి రావ‌డంతో ఆసుప‌త్రికి వెళ్ల‌గా క‌డుపులో రాళ్లు ఉన్నాయ‌ని, వాటిని తొల‌గించాల‌ని చెప్పాడు. దాని కోసం స‌ర్జ‌రీ చేయాల‌ని, రూ.25 వేలు ఖ‌ర్చు అవుతుంద‌ని చెప్పాడు. దీంతో ఆ మ‌హిళ భ‌ర్త ఆప‌రేష‌న్‌కు ముందే రూ.20 వేలు డిపాజిట్ చేశాడు.

ఆప‌రేష‌న్‌కు అంతా సిద్ధం చేసుకున్నాక ఫుల్లుగా మ‌ద్యం తాగి యూట్యూబ్‌లో వీడియో చూసిన మిశ్రా ఆ మ‌హిళ‌కు ఆప‌రేష‌న్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఆ మ‌హిళ క‌డుపులో లోతుగా క‌త్తితో కోయ‌డంతో ముఖ్య‌మైన న‌రాల‌న్నీ క‌ట్ అయిపోయి ఆ మ‌హిళ ప్రాణాలు విడిచింది.

దీంతో ఆ మ‌హిళ భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు వీళ్లు నిజ‌మైన డాక్ట‌ర్లు కాద‌ని, న‌కిలీ డాక్ట‌ర్ల‌ని పోలీసుల నిర్ధారించారు. గ‌త కొన్నేళ్లుగా అన‌ధికారికంగా క్లీనిక్‌ను న‌డుపుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement