త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ropeway Accident at Khallari Mata Temple | నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. మాత ఆలయం వద్ద తెగిన రోప్‌వే… మహిళ మృతి

ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

J

Crime | Published On Mar 22, 2026, 7.30 pm IST

Ropeway Accident at Khallari Mata Temple | నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. మాత ఆలయం వద్ద తెగిన రోప్‌వే… మహిళ మృతి
Advertisement

Ropeway Accident at Khallari Mata Temple | ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో 17 మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మహాసముంద్ జిల్లాల్లో ఉన్న ఖల్లారి మాత ఆలయం వద్ద ఉన్న రోప్‌వే కేబుల్ తెగడంతో దాని మీద ప్రయాణిస్తున్న వాళ్లు ఒక్కసారిగి కిందపడ్డారు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

3000 అడుగుల ఎత్తులో ఆలయం

నిజానికి ఈ ఆలయం 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాని మీదికి చేరుకోవడానికి అక్కడ రోప్‌వేను ఏర్పాటు చేశారు. నవరాత్రి ఉత్సవాలు కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. చాలామంది భక్తులు ఆలయానికి వెళ్లి తిరిగి రోప్‌వే ఎక్కారు. భక్తులతో కిందికి వస్తున్న సమయంలో రోప్‌వే తెగడంతో ట్రాలీ ఒక్కసారిగా కిందపడింది. దీంతో ట్రాలీలో ఉన్న రాయప్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల ఆయుషి సత్కర్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.

ropeway accident at the khallari mata temple in Chhattisgarh

ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆలయం నుంచి కిందికి వస్తుండగా, సుమారు 200 నుంచి 300 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు రోప్‌వే తెగి ట్రాలీ కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గత కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రస్తుతానికి ఖల్లారి ఆలయ రోప్‌వే సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ropeway accident at the khallari mata temple in Chhattisgarh

Advertisement

తాజావార్తలు

Advertisement