త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Encounter | క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ఐదుగురు మావోయిస్టులు మృతి

Encounter | తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లోని క‌ర్రెగుట్ట‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు (Encounter) కొన‌సాగుతున్నాయి. ఈ భారీ ఎన్‌కౌంట‌ర్‌లో ఐదుగురు మావోయిస్టులు (Maoists) మ‌ర‌ణించారు.

G

National | Published On Feb 19, 2026, 1.12 pm IST

Encounter | క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ఐదుగురు మావోయిస్టులు మృతి
Advertisement

Encounter | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లోని క‌ర్రెగుట్ట‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు (Encounter) కొన‌సాగుతున్నాయి. ఈ భారీ ఎన్‌కౌంట‌ర్‌లో ఐదుగురు మావోయిస్టులు (Maoists) మ‌ర‌ణించారు. ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతుండ‌టంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.

మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో కేజీహెచ్‌-2 పేరుతో సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్ర‌మంలో గురువారం తెల్ల‌వారుజామున భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల మ‌ధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించిన‌ట్లు భద్రతా బలగాలు వెల్ల‌డించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉండవచ్చని భావిస్తున్నారు.

కాగా, మావోయిస్టులు మధ్యప్రదేశ్‌ నుంచి కర్రెగుట్టల్లోకి ప్రవేశించారంటూ నిఘా వర్గాల సమాచారం మేరకు ఆ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా, గ్రేహౌండ్స్‌, డీఆర్జీ బలగాలు సంయుక్తంగా గాలింపు చేప‌ట్టాయి. సుమారు 5 వేల‌ మంది బ‌ల‌గాల‌తో అట‌వీ ప్రాంతాన్ని మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి జ‌ల్ల‌డ‌ప‌డుతున్నారు.

మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర‌నాయ‌క‌త్వంలో ఇప్ప‌టికే చాలా మంది మృతిచెందారు. న‌లుగురు మాత్రమే మిగిలారు. కాగా, తెలంగాణకు చెందిన 15మంది మావోయిస్టులు అజ్ఞాతంలో గ‌డుపుతున్నారు. వారిలో రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, మావోయిస్టు కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, పుసునూరి నరహరి అలియాస్‌ సంతోష్‌, ముప్పిడి సాంబయ్య, వార్త శేఖర్‌, జోడే రత్నభాయి, బడే చొక్కారావు ఉన్నారు.

Advertisement
Advertisement